
Telangana leader : భారతీయ జనతా పార్టీ భారత దేశము పరిపాలన పగ్గాలు మూడోసారి చేపట్టింది. ప్రధాన మంత్రిగా మోదీ ప్రమాణస్వీకారం చేశారు.తన మంత్రి వర్గ విస్తరణ కూడా హాట్టహాసంగా రాష్ట్రపతి భవన్ లో అట్టహాసంగా జరిగింది. మంత్రి వర్గంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కు కూడా బెర్తు దొరికింది. పార్టీ జాతీయ పదవితో పాటు కేంద్ర మంత్రి పదవి రెండింటికి న్యాయం చేయడం సాధ్యం కాదు. అంతే కాదు రాబోయే ఎన్నికల్లో పరిపూర్ణమైన మెజార్టీ సాధించాలి. కాబట్టి పూర్తి కాలపు నాయకుడు పార్టీకి ఎంతయినా అవసరం తప్పనిసరి. కాంగ్రెస్ కూడా మల్లి పునాదుల స్థాయి నుంచి బలోపేతం అవుతుంది. కాబట్టి పార్టీని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కంటే భిన్నంగా తయారు చేయాల్సిన అవసరం తప్పనిసరి. కాబట్టి కొత్త అధ్యక్షుడి కోసం పార్టీ అన్వేషణ మొదలెట్టింది.
ఇప్పటివరకు జాతీయ స్థాయిలో అధ్యక్ష భాద్యతలు మోసింది వెంకయ్యనాయుడితోపాటు బంగారు లక్ష్మణ్ ఉన్నారు. అది కూడా ఉమ్మడి రాష్ట్రములోనే. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత జాతీయ పదవి కోసం తెలంగాణ నుంచి కూడా ఆశపడేవారు కనబడుతున్నారు. ఎక్కువ శాతం జాతీయ భాద్యతలు మోసినవారు ఉత్తర భారత దేశానికి చెందినవారే ఉన్నారు. ఇప్పుడు కూడా ఉత్తర భారత దేశానికి చెందిన నాయకులే ఎక్కువగా పోటీపడుతున్నట్టుగా పార్టీ వర్గాల సమాచారం. పార్టీ జాతీయ అధ్యక్ష పదవి రావాలంటే కేవలం పార్టీ పెద్దల ఆశీస్సులు ఉంటే సరిపోదు. సంఘ్ పరివార్ కూడా మార్కులు వేయాల్సిందే. పరివార్ కు కూడా అనుకూలమై ఉండాలి. అంతే కాదు మొదటి నుంచి కూడా సంఘ్ లో భాద్యతలు మోసి ఆ తరువాత విద్యార్ధి పరిషత్, ఆ తరువాత పార్టీ అనుబంధ సంఘాల్లో భాద్యతలు సమర్థవంతంగా నిర్వహించిన నాయకుడై ఉండాలి. అప్పుడే జాతీయ స్థాయిలో అధ్యక్ష పదవి దక్కుతుంది.
ఇప్పుడు ఆ పదవి కోసం పార్టీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ ఆశ పడుతున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. లక్ష్మణ్ సంఘ్ పరివార్ నుంచి వచ్చిన నాయకుడు. ఉన్నత విద్యావంతుడు. ఈ నేపథ్యంలో కేంద్రంలో మంత్రిపదవి బెర్త్ దొరకని వారు కూడా ఈ పదవి కోసం ఎదురు చూస్తున్నారని తెలిసింది.