
Telangana minister had fun fishing :
మృగశిర కార్తె సందర్భంగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సరదాగా చేపలు పట్టారు. నేడు జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో ఎర్రబెల్లి దయాకర్రావు పర్యటించారు. అనంతరం రంగాపురం గ్రామంలోని కొందరు ముదిరాజ్ కులస్థులతో కలిసి ఆయన చెరువుల పండుగలో భాగంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో కలిసి వల వేసి చేపలు పట్టడం అందరినీ ఆకట్టుకుంది..
అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందన్నారు. మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ.. వలలు.. మత్స్యకార భవనాలను నిర్మిస్తుందని తెలిపారు. అలాగే కుల వృత్తుల వారికి చేయూతను ఇస్తుందన్నారు.






