
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య ఒక ఇంటర్వ్యూ లో జరిగిన సంభాషణ చాలా ఆసక్తికరంగా సాగింది. చిరంజీవి 2012 ఆగస్టు 27 నుంచి 2014 మే 26 వరకు కేంద్ర మంత్రిగా పని చేశారు. స్వతంత్ర శాఖ మంత్రిగా పని చేసిన చిరుకు అరుదైన ఘనత లభించింది.
స్వతంత్ర ప్రతిపత్తి హోదాలో చిరు తన మార్కును చూపించారు. 2018 వరకు రాజ్య సభ సభ్యుడిగా పనిచేసిన చిరంజీవి అనంతరం క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పని చేశారు. అయితే కిషన్ రెడ్డి, చిరంజీవి మధ్య జరిగిన సంభాషణ లో ఇద్దరు ఢిల్లీలో మంత్రులుగా ఉన్నప్పటి విషయాలు షేర్ చేసుకున్నారు. పర్యాటక శాఖ భవనంలో చిరు మంత్రి గా ఉన్న సమయంలో చేసిన పనులను కిషన్ రెడ్డి పొగిడారు.
కిషన్ రెడ్డి మరో విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ముఖ్యంగా చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కారు డ్రైవర్ గా చేసిన వ్యక్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి డ్రైవర్ గా చేస్తున్నాడని చెప్పడంతో వెంటనే రణదీర్ అంటూ డ్రైవర్ పేరును గుర్తుకు తెచ్చుకోవడం చూస్తుంటే చిరంజీవి ఎంత ప్రేమున్నా వ్యక్తో అర్థం చేసుకోవచ్చు.
చిరంజీవికి మనుషుల పట్ల ఎంత ప్రేమ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చిరంజీవి బాటలో ప్రస్తుతం ఎంతో నటీ నటులు, అభిమానులు, స్టార్ హిరోలుగా మారిన వారు ఉన్నారు. చిరంజీవి ఎంత ఎదిగిన ఒదిగే రకం ఉదాహారణే ఈ సంఘటన. ఒక కేంద్రమంత్రిగా మరో కేంద్ర మంత్రిని కొన్ని వివరాలు అడుగుతున్న సమయంలో డ్రైవర్ పేరుతో సహా చెప్పాడంటే ఆయన మెచురీటీకి సెల్యూట్ అంటున్నారు తెలుగు ప్రజలు.. సినీ అభిమానులు. తెలుగులో ప్రస్తుతం విశ్వంభర మూవీ చేస్తూ మెగాస్టార్ బిజీ బిజీగా గడుపుతున్నారు. మరి కొన్ని రోజుల్లో సినిమా రిలీజ్ కాబోతుంది.