38.7 C
India
Thursday, June 1, 2023
More

    GO 111 అంతం.. ఇక అభివృద్ధి బాటలో ఆ గ్రామాలు..

    Date:

    GO 111
    GO 111 end, CM KCR

    GO 111 : తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది ఈ రోజు (మే 18, గురువారం) మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొత్త సెక్రటరీనలో మొదటి కేబినేట్ భేటి నిర్వహించిన సీఎం కేసీఆర్ చల్లని కబురు వెల్లడించారు. దాదాపు 3 గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. దశాబ్ది వేడుకలతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

    జీవో 111 అంటే ఏమిటి..?

    అనంతగిరి కొండల నుంచి హైదరాబాద్‌ నగరం మీదుగా కృష్ణా నదిలో కలిసే మూసీ 1908లో ఉగ్రరూపం దాల్చింది. ఆ తర్వాత రెండు జంట జలాశయాలు నిర్మించారు. మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ (గంటిపేట), ఈసీపై హిమాయత్ నగర్ జలాశయాల నిర్మించారు. దీంతో నగరానికి వరద ముప్పు తగ్గింది. దీంతో పాటు నగరానికి తాగునీటి కొరత కూడా తీరింది. దాదాపు 2 దశాబ్దాల పాటు ఈ జలాశయాల్లో నీటినే నగర ప్రజలు తాగునీటిగా ఉపయోగించారు.  8 మార్చి, 1996లో వీటి రక్షణకు అప్పటి ప్రభుత్వం జీవో 111 తెచ్చింది. దీని ప్రకారం రెడు జలాశయాల పరీవాహన ప్రాంతాల్లోని 10 కి.మీ రేడియస్ లో 111 జీవో అమలు అవుతుంది. ఇందులోకి 84 గ్రామాలు వస్తాయి. ఈ గ్రామాల పరిధిలో 1,32,600 ఎకరాలు కేవలం వ్యవసాయం, వినోద జోన్లుగా మాత్రమే వినియోగించే పరిస్థితి నెలకొంది.

    అక్కడ అభివృద్ధి ఆమడ దూరం..

    ఈ జీవో కారణంగా మొయినాబాద్, శంషాబాద్, శంకర్ పల్లి, చేవెళ్ల, గండిపేట్, షాబాద్ మండలాల్లోని 84 గ్రామాల్లో ఇప్పటి వరకూ ఆంక్షలు కొనసాగేవి. నైరుతిలో ఆయా గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదు. నగరం చుట్టూ వేగంగా అభివృద్ధి జరుగుతున్నా. ఈ గ్రామలు మాత్రం వెనబడే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు, పారిశ్రామి సంస్థలు రాకపోవడంతో నగరం విస్తరణ ఒక వైపునకు ఆగిపోయింది. ఈ ప్రాంతాల్లో భూముల రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి.

    జంట జలాశయాల నుంచి నగరానికి రోజుకు40 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా అవుతుంది. ఉస్మాన్ సాగర్ నుంచి 15 ఎంజీడీలు, హిమాయత్ సాగర్ నుంచి 22 ఎంజీడీలు సరఫరా అయ్యేవి. గతంలో ఈ జలాశయాల నుంచి నీటి సరఫరా కాకుండా నగరం అల్లాడి పోయేది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నగరానికి కొన్నేళ్ల పాటు నీటి కష్టాలు రాకుండా చేశారు. కృష్ణా నది నుంచి 3 దశల్లో ప్రతీ రోజూ 270 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలించేందుకు సుంకిశాల పథకాన్ని పూర్తి చేశారు. తాగునీటి పథకం ద్వారా గోదావరి నుంచి ప్రతి రోజూ 170 మిలియన్‌ గ్యాలన్ల జలాలను తీసుకువస్తున్నారు.

    సింగూరు-మంజీరా నుండి రోజుకు 93 మిలియన్‌ గ్యాలన్లు ఇలా జంట జలాశయాల నుంచి కాకుండా నగరానికి 533 మిలియన్‌ గ్యాలన్ల ప్రతీరోజు తాగునీరు అందుతుంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ సాగర్‌ నుంచి కేశవాపురం వద్ద భారీ రిజర్వాయర్‌ నిర్మించనున్నారు. దీంతో అటు కృష్ణా, ఇటు గోదావరి నుంచి పుష్కలమైన నీటి లభ్యత ఉండడంతో సీఎం చెప్పినట్లుగా వందేండ్లకు కూడా హైదరాబాద్‌ తాగునీటి వ్యవస్థకు ఢోకా లేకుండా పోయింది.

    Share post:

    More like this
    Related

    మనం వాడే టైర్లు రీసైకిల్ చేయొచ్చా.. కువైట్ లో వీటిని ఏం చేశారు..?

      ఇప్పుడు వాడుతున్న ప్రతి వాహనానికి టైర్లు కీలకం. అయితే ఇవి వాడేసిన...

    ఆవుపాలు ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసా?

      మనం రోజు పాలు తాగుతుంటాం. పాలలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల...

    మరోసారి పూనకాలు లోడింగ్ అనేలా చిరు వింటేజ్ లుక్.. భోళా ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?

    మెగాస్టార్ చిరంజీవి భోళా మ్యానియా స్టార్ట్ అవ్వనుంది నుండి కొన్ని రోజుల...

    సునీల్ కనుగోలు కు బంపర్ ఆఫర్… ఏకంగా క్యాబినెట్ హోదా..!

    కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరింది.   భారీ విజయం సాధించడంతో అధికారంలోకి...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR Coverts : విపక్షాల్లో అలజడి సృష్టిస్తున్న ‘కేసీఆర్ కోవర్టులు’!

    KCR coverts : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు...

    CM KCR : ఏపీకి దూరంగా కేసీఆర్.. అక్కడ వదిలేసినట్లేనా..!

    CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ అడుగులు ఎవరికీ...

    Emergency days : మళ్లీ ఎమర్జెన్సీ రోజులు వచ్చాయంట.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

    Emergency days : రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తుందని...

    CM KCR : కేసీఆర్ అంటే మాములు ముచ్చట కాదు.. ఇక్కడ కథ వేరే ఉంటది..

    CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్న...