
Jasprit Bumrah : భారత క్రికెట్ జట్టుకు గోల్డెన్ ఆర్మ్ గా పేరొందాడు జస్ప్రీత్ బుమ్రా. టీమిండియా ఆశలు సస్నగిల్లిన సమయంలో తన బౌలింగ్ తో మ్యాచ్ ను మలుపు తిప్పాడు. అత్యద్భుతమైన బౌలింగ్ తో 2024 టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ను టీమిండియా ఆరుగుల పరుగుల తేడాతో ఓడించింది. భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. న్యూయార్క్లోని నసావు క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజం బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ విషయంలో పాక్ కెప్టెన్ కొంత సక్సెస్ అయ్యాడ. బ్యాటింగ్లో టీమ్ఇండియాను కేవలం 119 పరుగులకు కట్టడి చేశాడు.
తర్వాత బ్యాటింగ్ కు దిగిన పాక్ జట్టు ఓపెనర్లు నిలకడగా రాణించే ప్రయత్నం చేశారు. బాబర్ ముందుగానే అవుటైనప్పటికీ, రిజ్వాన్ టీమ్ ఇండియాను నిలువరించే ప్రయత్నం చేశాడు. కానీ జస్ప్రీత్ బుమ్రా మాత్రం పాక్ విజయానికి బ్రేకులు వేశాడు. లక్ష్య చేధనలో పాక్ జట్టు 12వ ఓవర్ వరకు గెలుపు ధీమాను కనపబర్చింది. మూడు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ 14వ ఓవర్ను బుమ్రాకు అప్పగించాడు. ఈ ఓవర్ తొలి బంతికే మహ్మద్ రిజ్వాన్ను బుమ్రా బౌల్డ్ చేశాడు.
రిజ్వాన్ వికెట్ తీయడంతో మ్యాచ్ టర్న్ అయ్యింది. 44 బంతుల్లో 31 పరుగులు చేసి రిజ్వాన్ ఔటయ్యాడు. రిజ్వాన్ ఈ వికెట్ పడటంతో టీమిండియా ఆటగాళ్లు ఉత్కంఠతో ఉన్నారు. ఆ తర్వాత పాక్ జట్టును భారత బౌలర్లు నియంత్రిస్తూ జట్టు మొత్తం 113 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ హైవోల్టేజీ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు . బుమ్రా నాలుగు ఓవర్లలో 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. బలమైన ఆటతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు.