
ఓటిటిలు కూడా పోటీ పడి మరీ సినిమా హక్కులను సొంతం చేసుకుంటున్నారు. అయితే ఒక సినిమాకు ఓటిటి డీల్ ఇప్పటి వరకు కుదరక పోవడం అందరికి ఆశ్చర్యంగానూ షాకింగ్ గాను అనిపిస్తుంది.. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాకు ఇలాంటిది జరగడం చర్చనీయాంశం అయ్యింది..
దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాల లిస్టులో ”ది కేరళ స్టోరీ” ఒకటి.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర కూడా సంచలన విజయం సాధించి ఏకంగా 200 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. మే నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా హక్కుల కోసం ఏ సంస్థ ముందుకు రాకపోవడం గమనార్హం..
ఎన్నో వివాదాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమాను సుదీప్తో సేన్ తెరకెక్కించాడు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ.. ఓటిటి హక్కుల కోసం ఎవ్వరూ ఆసక్తి చూపించడం లేదు.. మాకు మంచి ఆఫర్ వస్తే అప్పుడు ఆలోచిస్తాం.. అంటూ తెలిపారు. అన్ని వర్గాల నుండి పెద్ద ఎత్తున విమర్శలు రావడం వల్లనే ఈ సినిమాపై ఓటిటి సంస్థలు దూరంగా ఉంటున్నాయని.. అదే బెటర్ అని వారు భావిస్తున్నారు అని అర్ధం అవుతుంది.. చూడాలి చివరకు ఎవరు ముందుకు వస్తారో.
ReplyForward
|