
Catholic Church : భారత దేశంలో అతిపెద్ద భూ యజమాని తెలుసా..? భారత ప్రభుత్వం తర్వాత దేశంలో రెండో అతిపెద్ద భూ యజమానిగా కాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా నిలిచింది. 2021 ఫిబ్రవరి నాటికి ఈ సంస్థ ఆధీనంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 17.29 కోట్ల ఎకరాల భూమి కలిగి ఉంది. వీటిలో 2012 నాటికే 2,457 ఆస్పత్రులు, 240 మెడికల్/నర్సింగ్ కాలేజీలు, 28 సాధారణ కళాశాలలు, 5 ఇంజనీరింత్ కళాశాలలు, 3,765 మాధ్యమిక పాఠశాలలు, 7,319 ప్రాథమిక పాఠశాలలు, 3,187 నర్సరీ పాఠశాలలు మొత్తానికి 14వేలకు పైగా స్కూళ్లు, చర్చిలు, ఇతర సంస్థలు ఉన్నాయి. బ్రిటిష్ పాలనలో ‘ఇండియన్ చర్చ్ యాక్ట్’ ప్రకారం ఈ సంస్థకు భారీగా భూములు సమకూరాయి.