
Nagababu : మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా రాణించి ఈ స్థాయికి చేరుకున్నారు.. అందుకే ఈయన ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.. ఈయన తర్వాత మెగా కుటుంబం నుండి 10 మంది వరకు ఇండస్ట్రీ లోకి వచ్చారు.. ఇప్పటికే వారంతా కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
మెగా బ్రదర్స్ గా నాగబాబు కూడా ఇలానే వచ్చారు.. అయితే నాగబాబు మినహా మిగతా వారంతా హీరోలుగా రాణిస్తున్నారు.. నాగబాబు మాత్రం హీరోగా సక్సెస్ కాలేక పోయారు. దీంతో ఈయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తున్నారు.
మరి అలాంటి మెగా బ్రదర్ కారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ కమెడియన్ తాగుబోతుగా మారారని తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది.. నాగబాబు వల్ల ఒక కమెడియన్ తాగుబోతుగా మారడం ఏంటి? అనుకుంటున్నారా.. అయితే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. సినీ ఇండస్ట్రీలో కమెడియన్స్ కు కూడా మంచి గుర్తింపు ఉంటుంది అన్న విషయం తెలిసిందే..
అల్లు రామలింగయ్య, రేలంగి వంటి కమెడియన్స్ ఏ రేంజ్ లో పాపులర్ అయ్యారో చెప్పాల్సిన పని లేదు.. మళ్ళీ ఆ రేంజ్ గుర్తింపు పొందిన వారు బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ.. వీరు చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. ఎమ్మెస్ నారాయణ అయితే ఏడాదికి 40 సినిమాల్లో నటించారు. ఆయన మరణించే వరకు ఈయన నటిస్తూనే ఉన్నారు.
ఎమ్మెస్ నారాయణ ఎక్కువగా తాగుబోతు పాత్రల్లోనే నటించారు.. అయితే ఈయన మొదటిసారి తాగుబోతుగా నటించిన చిత్రం మాత్రం నాగబాబు హీరోగా వచ్చిన రుక్మిణి అనే సినిమాలో.. ఇక అప్పటి నుండి ఈయనకు అన్ని అలాంటి పాత్రలే వస్తున్నాయి.. నాగబాబు పట్టుబట్టి మరీ ఈ పాత్రలో ఈయన కరెక్ట్ గా సెట్ అవుతారు అని చేయించారట.. ఎమ్మెస్ నారాయణ అలానే మెప్పించి స్టార్ కమెడియన్ గా అయ్యారు..