26.9 C
India
Friday, January 23, 2026
More

    BJP vs Janasena : బీజేపీ వర్సెస్ జనసేన.. శ్రీవాణి నిధుల వ్యవహారంలో వివాదం

    Date:

     

     

    BJP vs Janasena :

    ఏపీలో కొంత కాలంగా బీజేపీ, జనసేన పార్టీలు మిత్రబంధంతో ముందుకెళ్తున్నాయి. చీఫ్ పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతలతో సఖ్యతతో వ్యవహరిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు టీడీపీతో కలిసి పోటీకి సన్నద్ధమవుతున్నాయనే చర్చ సాగుతున్నది. అయితే ఈ క్రమంలో టీటీడీ శ్రీవారి ట్రస్ట్ నిధుల వ్యవహారం జనసేన, బీజేపీ మధ్య చిచ్చు పెట్టినట్లు కనిపిస్తున్నది.

    శ్రీవాణి  ట్రస్ట్ పేరుతో రూ. పది వేల విరాళం ఇస్తే వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ ను రూ. ఐదు వందలకు ఇస్తున్నారు. ఆ పది వేల విరాళం లెక్కలు బయటకు చెప్పడం లేదని కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి అనుమానాలు ఉన్న సమయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి దీనిపై మాట్లాడారు. శ్రీవాణి ట్రస్టులో విరాళాలు ప్రక్కదారి పట్టడం లేదని, వీటిని హిందూ దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు, నిర్మాణాలకే వినియోగిస్తున్నారని చెప్పారు.  అనవసరంగా రాజకీయం చేయెద్దని వైసీపీ నేతలా మాట్లాడారు. ఇది విని బీజేపీ నేతలు కూడా ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే బీజేపీ వైసీపీకి లోపాయికారిగా సహకరిస్తున్నదన్న వాదనలు వినిపిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. వెంటనే జనసేన నాయకులు రంగంలోకి దిగారు.  బీజేపీ పై ఎదురుదాడికి దిగారు. భానుప్రకాశ్ రెడ్డి బీజేపీలో ఉన్నారా.. లేదంటే వైసీపీలో చేరారా అంటూ జనసేన నేత కిరణ్ రాయల్ ప్రశ్నించారు.
    భానుప్రకాష్ రెడ్డి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అధికార ప్రతినిధిలా మాట్లాడారని ఎద్దేవా చేశారు. శ్రీవాణి ట్రస్టుకు రూ. 1100 కోట్లు వచ్చాయని భానుప్రకాష్ రెడ్డి అంటే , వైవీ సుబ్బారెడ్డి మాత్రం ఎనిమిది వందల కోట్లు మాత్రమే వచ్చాయని చెప్పారని పేర్కొన్నారు. మిగిలిన మూడు వందల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో చెప్పాలని కిరణ్ రాయల్ ప్రశ్నించారు.అధికార పార్టీ నేతలు స్పందించకుండా, బీజేపీ నేత స్పందించడం అనుమానాలకు తావిస్తున్నదని మండిపడ్డారు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టేలా కనిపిస్తున్నది. ప్రభుత్వం తీరుపై జనసేన పోరాడుతుంటే, మిత్రపక్షమైన బీజేపీ మెతకవైఖరి అవలంబిస్తుండడం వివాదాలకు తావిస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BJP : బీజేపీ వైపు రేవంత్ రెడ్డి చూస్తున్నారా?

    ఇంటర్వ్యూలో నిజాలు బయటపెట్టిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో...

    Delhi elections : ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పై NRI లు ఏమన్నారంటే..

    Delhi elections : విభిన్న రాష్ట్రాల్లో వ్యూహపరమైన పొరపాట్లు, ప్రత్యర్థి పార్టీలతో అనవసరంగా...

    BJP : బీజేపీలోకి విజయసాయి కుమార్తె..!

    AP BJP : తెలుగు రాష్ట్ర రాజకీయాలలో విజయసాయి రెడ్డి వేస్తున్న అడుగులు.....

    Delhi elections : ఢిల్లీ ఎన్నికలు : ఐదు గ్యారెంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో!

    Delhi elections : మరో వారం రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి....