మనం పాములను చూస్తే మొక్కుతాం. వాటికి గుళ్లు కడతాం. వాటిని పూజిస్తాం. దేవుళ్లుగా కొలుస్తాం. నాగుల చవితి, నాగుల పంచమి పండుగలకు ప్రత్యేకంగా పాలు, గుడ్లు, నైవేద్యం పెట్టి మొక్కుతుంటాం. ఇలా మనకు జీవులతో పరస్పర అనుబంధం ఉంటుంది. దీంతోనే పాములను దైవాలుగా భావిస్తాం. ప్రత్యక్షంగా దేవుళ్లుగా అనుకుని వేడుకుంటాం. చల్లంగా చూడాలని కోరుకుంటాం.
ప్రతి దేవాలయంలో పాముల కోసం ప్రత్యేకంగా విగ్రహాలు ఏర్పాటు చేస్తుంటారు. పాములను ప్రత్యక్ష దేవుళ్లుగా కొలుస్తారు. దీంతో అవి ఎదురు పడితే రెండు చేతులు ఎత్తి మొక్కుతాం. అలా పాములను మనం పూజించడం అలవాటుగా మారింది. పాములను దేవుళ్లుగా కొలవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని నమ్ముతాం.
ఈనేపథ్యంలో తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని కురుచ్చి శక్తి నగర్ లో ఓ శ్వేత నాగు స్థానికుల కంట పడింది. దీంతో వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి దాన్ని పట్టుకుని అడవిలో వదిలేశారు. జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటి తెలుపు వర్ణంలో కనిపిస్తుందని తెలిపారు. ఇలాంటి పామును ఇంతవరకు చూడలేదని స్థానికులు తెలిపారు.
ఇలా శ్వేత నాగు కనిపించడంతో అందరు ఆశ్చర్యపోయారు. వర్షాలు పడుతుండటంతో వరదలకు కొట్టుకొచ్చి ఉంటుందని చెబుతున్నారు. పాము తెల్లగా ఉండటంతో అందరు వింతగా చూశారు. మొత్తానికి పామును అడవిలోకి పంపడంతో కథ సుఖాంతమైంది. తెలుపు వర్ణంలో ఉన్న పామును చూసి అందరు ఎగాదిగా చూశారు. శ్వేత నాగును ఇంతవరకు చూడలేదని పేర్కొన్నారు.