
Actor Prithviraj : ప్రముఖ తెలుగు సినీ నటుడు పృథ్వీరాజ్ విసిరే డైలాగ్ ఆయన అభిమానులకు, ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్విస్తుంది. థర్టీ ఇయర్స్ ఎక్ప్ పీరియన్స్ ఇక్కడ అంటూ హీరో, హీరోయిన్ లతోపాటు విలన్ ల ముందు విసిరే పంచ్ లు అదరగొడుతాయి. ఆయన సినిమాలో కనబడితే చాలు థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డైలాగ్ ఉన్నట్టే. కానీ ఆయన ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగక తప్పడంలేదు. కోర్టుకు సకాలంలో హాజరు కాకపోవడంతో అతనికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ న్యాయమూర్తి జారీ చేశారు. కేసుకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మంచి కమెడియన్ గా దూసుకుపోతున్న పృథ్వీ రాజ్ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఈ నేపథ్యంలోనే పలు వ్యక్తిగత వివాదాల్లో జోక్యం చేసుకోవడంతో పరిశ్రమకు కొద్ది రోజుల నుంచి దూరమయ్యారు. అప్పుడప్పుడు రాజకీయపరంగా నవ్విస్తూ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఆయనపై ఒకేసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.
విజయవాడకు చెందిన బలిరెడ్డి శ్రీ లక్ష్మికి , నటుడు పృథ్వీ రాజ్ కు 1984 లో వివాహం జరిగింది. వీరికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఇద్దరికీ మనస్పర్థలు ఏర్పడ్డాయి. దూరమయ్యారు. ఎందుకు దూరమయ్యారో ఇప్పటివరకు ఆయన కానీ, ఆయన భార్య శ్రీ లక్ష్మి కానీ వెల్లడించలేదు. గత కొంత కాలం నుంచి వీరిద్దరూ దూరంగానే ఉంటున్నారు. పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటుంది భార్య. తనతో పాటు తన పిల్లల పోషణ కోసం ప్రతి నెల ఎనిమిది లక్షల రూపాయలను ఇప్పించాలని కోరుతూ 2017 లో భార్య శ్రీ లక్ష్మి కోర్టుకు వెళ్ళింది. ఏప్రిల్ 6, 2016 లో నన్ను, నా పిల్లలను వెళ్లగొట్టడంతో పుట్టింటింకి వెళ్లినట్టు కోర్టుకు తెలిపింది. తన భర్త సినిమాలు, టివి సీరియళ్ల ద్వారా ప్రతి నెల ముప్ఫయ్ లక్షల రూపాయలను సంపాదిస్తున్నాడు. కాబట్టి ప్రతి నెల తనకు తన భర్త ఎనిమిది లక్షల రూపాయల భరణం ఇప్పించాలని కోర్టును శ్రీ లక్ష్మి కోరింది.
ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్ తాను అంతగా చెల్లించలేనంటూ హై కోర్ట్ కు వెళ్ళాడు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన కోర్ట్ ప్రతి నెల రూ : 22 వేలు చెల్లించాలని ఆదేశించింది. అదేవిదంగా అప్పటివరకు ఉన్న బకాయిలను కూడా చెల్లించాలని ఆదేశించింది. కానీ పృథీరాజ్ కోర్ట్ తీర్పు మేరకు చెల్లించలేదు. దింతో భార్య మల్లి కోర్టుకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో కోర్ట్ పృథ్వీ రాజ్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.