
తెలంగాణ ఏర్పడితే అక్కడ కరెంట్ ఉండదు… అప్పుల పలు అవుతుంది.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది… అనీ తెలంగాణ ఏర్పడక ముందు ఆంధ్ర రాజకీయ నాయకులు పదే పదే చెప్పే మాటలు ఇవి కానీ ఇప్పుడు ఆ మాటలు ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రతి ఒక్క తండ్రి తన కొడుకు ప్రభుత్వ ఉద్యోగం సాదించాలి అనీ అనుకుంటాడు.. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా ఒకటో త వస్తుందనే ఓ భరోసా. అందుకే కాంట్రాక్ట్ ఉద్యోగిగా అయినా సరే చాన్స్ వస్తే చేరిపోదామని చూసేవారు ఎంతో మంది ఉంటారు. తర్వాత క్రమబద్దీకరణ చేస్తారని ఆశలు పెట్టుకుంటారు. రాజకీయ పార్టీలు ఇలాంటి హామీలు ఎన్నో ఇస్తూంటాయి. అమలు చేసేవారు వారు కొందరే. తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్దీకరిస్తూ సీఎం కేసీఆర్ సంతకం చేశారు. కానీ ఏపీ ఉద్యోగులు జీతాల కోసం రోడ్డెక్కుతున్నారు. తెలంగాణ ఉద్యోగులు .. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉన్నారు. తొలి సారి 43 శాతం ఫిట్ మెంట్… ఆ తర్వాత మరోసారి 30శాతం ఫిట్ మెంట్ అందుకున్నారు. ఎప్పటికప్పుడు డీఏలు ఇస్తున్నారు.
ఏపీలో టీడీపీ 2014 లో బాబు ప్రభుత్వం వచ్చినప్పుడు ఆర్థిక సమస్యలు ఉన్నా 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు పీఆర్సీ వేయడమే కాకుండా 17శాతం మధ్యంతర భృతి కూడా ఇచ్చారు. 2019 లో వైసీపీ సర్కార్ వచ్చిన జీతాన్ని తగ్గించేసింది. డీఏలు ఎగ్గొట్టింది. రకరకాల కారణాలు చెప్పి అసలు జీతం పెరగకుండా చేసింది. దాంతో ఉద్యోగులు నష్టపోయారు. మరో పీఆర్సీ సమయం వచ్చినా ప్రభుత్వం ఇస్తుందన్న నమ్మకం లేదు. పీఆర్సీ ఐదెండ్ల ఒకసారి వేస్తామని చెప్పడం… ఉద్యోగుళ్లో మరింత ఆందోళన లో పడేసింది.. పెండింగ్ డీఏలు..ఇతర సమస్యల పరిష్కారం కోసం .. చర్చల పేరుతో పిలిచి అవమానించడం వంటివి చేస్తున్నారు. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతున్నా.. జీతాలు పెరగకపోవడంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు.
వైఎస్ జగన్ తన పాదయాత్రలో భాగంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని క్రమబద్దీకరిస్తామని జగన్ చాలా హామీలిచ్చారు. ఇంత వరకూ చేయలేదు. తెలంగాణ సర్కార్ చేసింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా తెలంగాణలో సుఖంగానే ఉన్నారు. వారి జతాలకు ఇబ్బంది లేదు. కానీ ఏపీలో వారి జీతాలను ప్రభుత్వం వాడుకుంటోంది. వారికి ఎప్పటికి ఇస్తుందో తెలియడం లేదు. ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసే పరిస్థితి వచ్చిందని ఇంకా ఉపేక్షిస్తే కొన్ని రోజులకు జీతాలు కూడా రావన్న ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారు.
ఏపీలో ఉద్యోగుల విషయంలో ఇలాగే మొండిగా వ్యవహారిస్తే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాయి అనీ సమాచారం.. ఇలాగే ఉంటే రాబోయే ఎన్నికల్లో వైసీపీ మరిన్ని కష్టాలు తప్పవు.






