కొవిడ్ 2019లో వెలుగు చూసింది. ప్రపంచాన్ని గడగడలాడించింది. రెండేళ్ల పాటు మనుషుల జీవనంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. దీంతో చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారు. అగ్రరాజ్యం నుంచి కింది దేశాల వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాక్ డౌన్ తో ఎన్నో కష్టాలు పడ్డాం. కరోనాను తగ్గించే క్రమంలో టీకాలు తయారు చేయడంతో వ్యాధి నియంత్రణలోకి వచ్చింది. ఈ మేరకు ప్రపంచం ఇప్పుడు ఊపిరి పీల్చుకుంది.
ఈ నేపథ్యంలో అమెరికా వెళ్లాలంటే కరోనా టీకా తీసుకోవాలనే నిబంధన తీసుకొచ్చింది. దీంతో అమెరికా వెళ్లే వారు తప్పకుండా టీకా తీసుకోవాల్సిన అవసరం ఉండేది. ప్రస్తుతం ఆ నిబంధనలను సడలించింది. దీంతో ఇకపై అమెరికా వెళ్లాలంటే టీకా తీసుకోవాల్సిన అవసరం లేదు. దీంతో ఆ దేశం వెళ్లే వారు ఇక మీదట టీకాలు తీసుకోవాల్సిన పని లేదు.
అమెరికాలో కూడా వ్యాధి తీవ్రత తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. దీని వల్ల అమెరికా వెళ్లే వారు టీకా తీసుకోవాల్సిన పని లేదు. అగ్రరాజ్యం వెళ్లాల్సిన కాంట్రాక్టర్లు, ఉద్యోగులు ఎవరైనా సరే టీకా తీసుకోవాల్సిన అవసరం లేకుండా నిబంధన తీసుకొచ్చింది. మే 11తో ఈ నిబంధనలు అమల్లో ఉండవు.
అమెరికా తీసుకున్న నిర్ణయంతో అందరిలో హర్షం వ్యక్తమవుతోంది. ఇంతవరకు టీకా వేసుకుని వెళ్లాల్సి ఉండేది. తాజా నిబంధనల ప్రకారం టీకా తీసుకోకుండానే వెళ్లొచ్చు. దీనిపై నిబంధనలు సరళతరం చేయడం వల్ల అక్కడకు వెళ్లాలనుకునే వారికి ఊరట కలగనుంది. వైట్ హౌస్ సాక్షిగా తీసుకున్న సంచలన నిర్ణయంతో అందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.