మనదేశంలో అల్లర్లు చెలరేగేందుకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా మన దేశంలోని కొందరిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. వారి ద్వారా మనదేశంలో అల్లర్లు చేయాలని తలపిస్తున్నాయి. దీని కోసం కొన్ని యాప్ లు తీసుకొచ్చి వాటి ద్వారా మన సమాచారం చోరీ చేస్తున్నారు. ఈ దుశ్చర్యలను కేంద్రం గుర్తించింది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగింది.
దేశంలోని 14 మెసేజ్ యాప్ లు పాకిస్తాన్ కు అనుకూలంగా పని చేస్తున్నాయని తేల్చింది. దీంతో వాటిపై నిషేధం విధించింది. ఇక మీదట ఆ యాప్ లు వినియోగిస్తే చట్టపరంగా శిక్షార్హులవుతారు. క్రిప్ వైజర్, ఎనిగ్మా, సేఫ్ స్విస్, మీడియా ఫైర్, ఐఎంక్యూ, బిఛాట్, బ్రైయర్, సెకండ్ లైన్ తదితర యాప్ లపై ఆంక్షలు విధించింది. వీటిని వాడవద్దని హెచ్చరించింది.
దేశభద్రత కోసం ఇలాంటి యాప్ లను నిషేధించడం సాధారణమే. ఇంత వరకు సుమారు 250 యాప్ లను నిషేధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలనే ఈ 14 యాప్ లు దేశానికి నష్టం తెస్తున్నాయనే ఉద్దేశంతో వాటి వాడకంపై నిషేధం తీసుకొచ్చింది. కశ్మీర్ కేంద్రంగా ఈ యాప్ లో నష్టాలే కలుగుతాయని సూచించింది. దీంతో వీటిని ఎవరు కూడా వాడితే జైలుకు వెళ్లడం ఖాయం.
మన దేశానికి చైనా, పాక్ లతో ఉన్న ముప్పు వల్ల చాలా వరకు యాప్ లను మనదేశం అడ్డుకుంటోంది. దేశానికి ముప్పు వాటిల్లే సందర్భంలో ఎలాంటి చర్యలకైనా దిగుతుంది. అందుకే దేశంలోని ఈ 14 యాప్ ల వల్ల మనకు ఇబ్బందులు ఉన్నందున వాటిని నిషేధించింది. కశ్మీర్ లోని కొందరు ముష్కరులు ఈ యాప్ ల ద్వారా మన దేశంలోని కీలక సమాచారాన్ని వారికి అందజేస్తున్నారు. దీంతోనే వీటిపై నిషేధం విధించింది.