
Chandrababu New cabinet : ఏపీలో నేడు కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతుంది. సీఎంగా నాలుగోసారి నారా చంద్రబాబు నాయుడు.. తొలిసారి డిప్యూటీ సీఎంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిద్దరితో పాటుగా మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు. పవన్ కల్యాణ్ తో సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను విడుదల చేశారు. కేబినెట్లో ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచారు. జనసేనకు మూడు, బీజేపీ ఒక స్థానం కేటాయించారు. సీనియర్లకు, యువతకు కొత్త మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యం కల్పించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
1. నారా చంద్రబాబు నాయుడు (సీఎం, కుప్పం)
2. కొణిదెల పవన్ కల్యాణ్ (డిప్యూటీ సీఎం, పిఠాపురం)
3. నారా లోకేశ్ (మంగళగిరి)
4. కింజరాపు అచ్చెన్నాయుడు (టెక్కలి)
5. కొల్లు రవీంద్ర (మచిలీపట్నం)
6. నాదెండ్ల మనోహర్ (తెనాలి)
7. పి.నారాయణ (నెల్లూరు సిటీ)
8. వంగలపూడి అనిత (పాయకరావుపేట)
9. సత్యకుమార్ యాదవ్ (ధర్మవరం)
10. నిమ్మల రామానాయుడు (పాలకొల్లు)
11. ఎన్.ఎమ్.డి.ఫరూక్ (నంద్యాల)
12. ఆనం రామనారాయణరెడ్డి (ఆత్మకూరు)
13. పయ్యావుల కేశవ్ (ఉరవకొండ)
14. అనగాని సత్యప్రసాద్ (రేపల్లె)
15. కొలుసు పార్థసారధి (నూజివీడు)
16. డోలా బాలవీరాంజనేయస్వామి (కొండేపి)
17. గొట్టిపాటి రవి కుమార్ (అద్దంకి)
18. కందుల దుర్గేష్ (నిడదవోలు)
19. గుమ్మడి సంధ్యారాణి (సాలూరు)
20. బీసీ జనార్థన్ రెడ్డి (బనగానపల్లె)
21. టీజీ భరత్ (కర్నూలు)
22. ఎస్.సవిత (పెనుకొండ)
23. వాసంశెట్టి సుభాష్ (రామచంద్రాపురం)
24. కొండపల్లి శ్రీనివాస్ (గజపతినగరం)
25. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి (రాయచోటి)
చంద్రబాబు కొత్త కేబినెట్లో ఉన్న మొత్తం 24మందిలో సగం మంతి కొత్త వారే. 24మందిలో 17 మంది కొత్త వాళ్లు ఉన్నారు.. ముగ్గురు మహిళలు, ఎనిమిది మంది బీసీలు, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనార్టీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు ఛాన్స్ ఇచ్చారు. బీజేపీ నుంచి ఎవరికి అవకాశం కల్పించాలనే అంశంపై క్లారిటీ రాకపోవడంతోనే జాబితా విడుదల లేట్ అయింది.
మంత్రివర్గంలో ఇద్దరు మాత్రం చాలా లక్కీ అనే చెప్పాలి.. వారిద్దరే ఆనం రాంనారాయణరెడ్డి, కొలుసు పార్థసారథి. వీరిద్దరు వైసీపీ నుంచి వచ్చి ఏకంగా మంత్రి పదవి దక్కించుకున్నారు. వారికి గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది.. అందుకే ప్రాధాన్యం ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. నారా లోకేష్ గతంలో మంత్రి పదవి తీసుకోరన్న ప్రచారం జరిగింది. అయితే ఆయన్ను కూడా చంద్రబాబు మంత్రివర్గంలో తీసుకున్నారు. కొన్ని జిల్లాల్లో ఇద్దరు.. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం లభించింది.