
Rahul Gandhi కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల నిషేధం కేసుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో రెండేళ్ల నిషేధంపై సుప్రీంకోర్టు అనుకూలంగా స్టే ఇవ్వడంతో ఏప్రిల్ లో ఖాళీ చేసిన బంగ్లాను మళ్లీ రాహుల్ కు కేటాయించారు. మోదీ ఇంటి పేరు గల వారందరు మోసగాళ్లను ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టులో కేసు వేయడంతో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని రెండేళ్లు అనర్హుడిగా ప్రకటించింది. పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసింది.
దీనిపై రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు వెళ్లగా దానిపై స్టే విధించింది. దీంతో రాహుల్ 2005నుంచి ఉన్న అధికారిక నివాసం ఇప్పుడు మళ్లీ రాహుల్ కే ఇచ్చారు. దీంతో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుకు విలువ లేకుండా పోయింది. సోమవారం రాహుల్ గాంధీ పార్లమెంట్ లో అడుగు పెట్టారు. వాయనాడ్ లోని ఆయన బంగ్లాను ఆయనకే కేటాయించినట్లు సమాచారం.
ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులో ఉన్న బంగ్లానే లోక్ సభ హౌస్ కమిటీ కేటాయించినట్లు చెబుతున్నారు. పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష ఖరారైన లోక్ సభ సభ్యత్వం రద్దు కావడంతో తుగ్లక్ రోడ్డులోని తన అధికారిక బంగ్లాను రాహుల్ ఖాళీ చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ లో లోక్ సభ హౌస్ కమిటీ నోటీసులు ఇవ్వడంతో రాహుల్ తన బంగ్లాను ఖాళీ చేశారు.
పరువు నష్టం కేసులో రాహుల్ పై పెట్టిన కేసు రద్దు కావడంతో కాంగ్రెస్ నేతకు మళ్లీ బంగ్లా దక్కడం ఆయనకు పోయిన పరువు తిరిగి వచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీపై పెట్టిన కేసు వీగిపోవడంతో ఆయనకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.






