
Indians in Dallas : టెక్సాస్ లో హ్యూమన్ లేబర్ అక్రమ రవాణా రాకెట్ నడుపుతున్న నలుగురు ప్రవాస భారతీయులను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. 15 మంది మహిళలు అక్రమ రవాణా బాధితులుగా గుర్తించిన ప్రిన్స్టన్ పోలీసులు ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
బెడ్ బగ్స్ నివారణ కోసం పెస్ట్ కంట్రోల్ కంపెనీకి ఇంటింటికీ తిరుగుతున్న సమయంలో సంతోష్ కట్కూరి, అతని భార్య ద్వారకా గుండా అద్దెకు తీసుకున్న ఇంట్లోకి కంపెనీ బృందం వెళ్లింది. వారి ఇంట్లో ప్రతీ గదిలో నేలపై నిద్రిస్తున్న ముగ్గురి నుంచి ఐదుగురు యువతులు, అనేక భారీ సూట్ కేసులను చూశారు. ఇది అసాధారణమైనదిగా భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు.
ప్రిన్స్టన్ లోని కొలిన్ కౌంటీలోని గిన్స్ బర్గ్ లైన్ లో ఒకే ఇంట్లో వీరంతా తక్కువ ఫర్నీచర్, దుప్పట్ల లేకుండా నేలపై పడుకుంటున్నారని అధికారులు గుర్తించారు. హ్యూమన్ లేబర్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో చందన్ దాసిరెడ్డి (24), ద్వారకా గుండా (31), సంతోష్ కట్కూరి (31), అనిల్ మాలే (37)ను అరెస్టు చేశారు.
ప్రిన్స్టన్ పోలీసుల తదుపరి దర్యాప్తులో సంతోష్ కట్కూరి ఇంట్లో 15 మంది మహిళలు కనిపించారని, అక్కడ వారు అతనితో పాటు అతని భార్య డొల్ల వారి కంపెనీలో పనిచేయాలని బలవంతం చేశారని తేలింది. బలవంతపు శ్రమ దోపిడీకి సంబంధించి ల్యాప్ టాప్ లు, సెల్ ఫోన్లు, నకిలీ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రిన్స్ టన్ పోలీస్ సర్జెంట్ కరోలిన్ క్రాఫోర్డ్ ఈ నలుగురి కింద 100 మందికి పైగా బాధితులు ఉన్నారన్నారు. అయితే కార్మికుల గురించి వివరాలు వెల్లడించలేదు.
తమ ఇంటిని క్రిమినల్ కార్యకలాపాలకు వాడుకున్నారని ఇంటిని అద్దెకు తీసుకున్న యజమానులు షాక్ కు గురవుతున్నారు. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అక్కడి పోలీసులు తెలిపారు.