
Welcome to Modi : ఈ నెలాఖరులో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకమైన అమెరికా పర్యటనలో వాషింగ్టన్ను సందర్శించనున్నారు. ఇది చారిత్రాత్మక పర్యటనగా చెబుతున్నారు. ఉక్రెయిన్పై రష్యా దండయాత్రతో రెండు దేశాల ప్రధాన విభేదాలు ఉన్నప్పటికీ వాషింగ్టన్ -బీజింగ్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ఇండో-పసిఫిక్ వ్యూహాన్ని అమలు చేయడంలో బిడెన్ పరిపాలనకు విజయాల నేపథ్యంలో వాషింగ్టన్ అమెరికా అధికారిక నివాసంలోకి మోదీకి ఘన స్వాగతం పలికేందుకు రెడీ అవుతున్నారు.
ఇండో-పసిఫిక్లో నెట్వర్క్డ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్లో భారతదేశం ఎంతో ముఖ్య భాగంగా అమెరికా గుర్తిస్తోంది. చైనీస్ దూకుడును ఎదుర్కొనేందుకు భారత్ పై విశ్వాసం, దాని సామర్థ్యాలను పెంపొందించాలనే దీర్ఘకాలిక వ్యూహంలో భారత ప్రధాని మోడీకి అమెరికా స్వాగతం పలుకుతోంది.
ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్పై దాడి చేసిన కొద్దికాలానికే, అమెరికాను దాటి చైనా విజృంభిస్తోంది. యురోపియన్ దేశాలపై అమెరికా కంటే చైనా ప్రభావం చూపిస్తోంది. యునైటెడ్ స్టేట్స్ ను మించి వనరులు చైనా వినియోగించుకొని ఎదుగుతోందని.. ఇండో-పసిఫిక్ ప్రాంతం మరోసారి అమెరికా, చైనా ప్రచ్చన్న యుద్దానికి ప్రతీకగా మారుతుందని భయపడ్డారు.
నిజానికి, ఇది బీజింగ్ కోరిక అయి ఉండవచ్చు. అయితే, అందుకు విరుద్ధంగా అమెరికా భారత్ తో స్నేహహస్తం చాటుతోంది. బిడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉక్రేనియన్లకు బిలియన్ల సైనిక , ఆర్థిక సహాయాన్ని అందించినప్పటికీ మరియు ఐరోపాతో దాని సంకీర్ణాన్ని బలోపేతం చేసినప్పటికీ, ఇది దాని ఇండో-పసిఫిక్ వ్యూహం లో భాగం కాదు. చైనాకు చెక్ పెట్టేందుకే భారత్ కు ప్రాముఖ్యతను ఇస్తూ మన మోడీకి అమెరికా ఘన స్వాగతం పలుకుతోంది.






