దర్శకుడు సుకుమార్ కు విరామం కావాలట. సినిమాలను తీయడం, మరో సినిమాకు కథ అందించడమే తప్ప మరో వ్యాపకం తెలియదు. ఇటీవల సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. దీనిపై ఆయన కలవరపాటుకు గురయ్యారు. పుష్ప హిట్ కావడం ఆయన మంచి రెమ్యునరేషన్ తో పాటు గిఫ్ట్ లు, లెక్కకుమించి డబ్బు దొరకిందని మీడియాలో వివిధ కథనాలు వచ్చాయి.
ఐటీ రైడ్స్ నేపథ్యంలో ఆయనను అధికారులు రోజుల తరబడి ప్రశ్నిస్తున్నారు. ఈ అనుభవాన్ని ఆయన ఎప్పుడూ ఎదుర్కోలేదు. దీంతో ఆయన కొంచెం అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో పుష్ప-2 షూటింగ్ లో ఆయన పాల్గొనలేకపోతున్నారట. ఐటీ రైడ్స్ నేపథ్యంలో తనకు కొంత విరామం కావాలని ఆయన కోరుతున్నారట. గత వారం ఫైట్స్ సీన్ చిత్రీకరించేందుకు వెళ్లలేదు. సినిమా చిత్రీకరణ వేగంగా కొనసాగుతున్న సమయంలో ఐటీ రైడ్స్ తో కొంత విరామం వచ్చినట్లు తెలుస్తోంది.
రెండు వారాల్లో ఈ మూవీకి సంబంధించిన కొత్త షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉంది. సుకుమార్ ఈ గందరగోళం నుంచి బయటకు వస్తారా..? చిత్రీకరణ ఎప్పుడు పూర్తవుతుంది..? అంటూ అభిమానులు, మైత్రీ మూవీ మేకర్స్, అల్లు అర్జున్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారట. ఏది ఏమైనా ఆయన పుష్ప-2 మరింత వేగంగా పూర్తి చేయాలని అందరూ కోరుకుంటున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. దీనిపై చాలా విశ్లేషణలు జరిగాయి. మరింత శ్రద్ధ పెడితే తప్ప అనుకున్న రేంజ్ లో మూవీ రాదు. మరి సుకుమర్ ఏ మేరకు శ్రమిస్తాడో చూడాలి..