
Double iSmart : దర్శకుడు పూరీ జగన్నాథ్ ‘లైగర్’తో విజయ్ దేవరకొండకు, ట్రేడ్ వర్గాలకు భారీ షాక్ ఇచ్చాడు. ఈ మూవీ తర్వాత పూరిపై కోలుకోలేని దెబ్బపడింది. కేవలం పూరి జగన్నాథ్ కే కాకుండా చార్మిపై కూడా దెబ్బపడింది. ఈ సమస్యల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు పూరి. ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్ట్ ‘డబుల్ ఇస్మార్ట్’పై వర్క్ చేస్తున్నాడు. రామ్ పోతినేని పూరీ కాంబోలో ఈ సినిమా రాబోతోంది.
‘ఇస్మార్ట్ శంకర్’ (2019)కు మణిశర్మ అందించిన సంగీతం వెన్నెముకగా నిలిచింది. ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం మణిని తీసుకున్న పూరి జగన్నాథ్ ఈ సినిమా నుంచి కొద్ది రోజుల క్రితం ‘స్టెప్పామార్’ అనే ఫస్ట్ పాటను విడుదల చేశారు. మాస్ ను మెప్పించడమే లక్ష్యంగా ఈ పాట ఉన్నప్పటికీ సంగీత ప్రియులను ఆకర్షించడంలో మాత్రం కొంచెం వెనుకబడిందని చెప్పవచ్చు.
పూరి ప్రస్తుత స్థితిని పరిగణనలోకి తీసుకుంటే మొదటి పాట చర్చనీయాంశంగా కాకుండా ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ గా మారి ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే సాలిడ్, రిపీట్ చార్ట్ బస్టర్ ఉంటే తప్ప ప్రీ రిలీజ్ బజ్ కు పాసబుల్ నంబర్లు పెద్దగా ఉపయోగపడవు. మరి మణిశర్మ నుంచి పూరి ఏం రాబట్టాడో, వీరి కాంబోలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ లో ని రెండో పాట అయినా వీరికి అదృష్టం తీసుకువస్తుందో లేదో చూడాలి. ఇక ‘డబుల్ ఇస్మార్ట్’ ఆగస్టు 15న విడుదల చేస్తామని పూరి ఇప్పటికే ప్రకటించాడు.