
Tomato Prices : రిటైల్ మార్కెట్లలో నిత్యావసర కూరగాయల ధర ₹ 100 దాటేసింది. కొన్ని చోట్ల అంతకంటే ఎక్కువ ఉండటంతో సామాన్యులు కొనడానికి భయపడుతున్నారు. గత కొన్ని రోజులుగా అనేక రాష్ట్రాల్లో టమోటా ధరలు పెరిగాయి. మండే ఎండలు.. అనిశ్చిత వాతావరణ పరిస్థితుల కారణంగా దాని సరఫరాపై ప్రభావం చూపడంతో టమోటా ధరలు అకస్మాత్తుగా పెరిగాయి.
సరఫరా సంక్షోభం మధ్య, రకాన్ని బట్టి కిలోకు ₹80-120 వరకు ధరలు పెరిగాయి. ప్రధానంగా రాష్ట్రాల్లో వరదలు , భారీ వర్షాల కారణంగా సరఫరా ప్రభావితమైంది. గత కొద్దిరోజులుగా దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణతోపాటు కొన్ని కొండ ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్నాయని, దీంతో పంట నష్టం వాటిల్లిందని, సరఫరాలో అంతరాయం ఏర్పడిందని నిపుణులు తెలిపారు.
రానున్న రెండు రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి ధరల పెరుగుదలకు కారణమైన కారణాలలో ఉత్పత్తి కొరత , మండే ఎండల వల్ల పంటలు ఎండిపోవడం వల్ల ఉత్పత్తి పడిపోయింది. ఇది కూడా ఒక కారణమని రైతులు పేర్కొన్నారు.
వివిధ కారణాల వల్ల ఈ ఏడాది తక్కువ టమోటాలు నాటినట్లు కమోడిటీ నిపుణుడు అజయ్ కేడియా తెలిపారు. బీన్స్ ధరలు బాగా పెరగడంతో చాలా మంది రైతులు బీన్స్ సాగుకు మారారు.
గత నెలల్లో టొమాటో ధరల పతనం కారణంగా ఎవరూ పంట వేయలేదు. దీంతో ఇప్పుడు ఈ భారీ ధరలు పెరిగాయి. ఉత్తరప్రదేశ్లోని స్థానిక మార్కెట్లలో వారం క్రితం కిలో ₹40 నుండి ₹50 వరకు విక్రయించిన టొమాటో ఇప్పుడు కిలో ₹100కి డిమాండ్ పెరిగింది. ఢిల్లీలో కిలో ₹80కి విక్రయిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్లలో కిలో టమాట ధర రూ.100కి చేరుకుంది.






