మణిరత్నం కలల ప్రాజెక్టు పొన్నియిన్ సెల్వన్ దీన్ని రెండు పార్టులుగా తెరకెక్కించారు. తన కలల ప్రాజెక్టు అంటూనే భారీ తారాగణాన్ని సెలక్ట్ చేసుకున్నారు. ఈ సినిమాలో రెండు పార్టులలో కీలక భూమిక పోషించిన హీరోయిన్స్ త్రిష, ఐశ్వర్య రాయ్. ఐశ్వర్య రాయ్ అందం గురించి చెప్పక్కర్లేదు. కానీ అంతకంటే ఎక్కువ అందంగా త్రిషను చూపెట్టాడు దర్శకుడు మణిరత్నం.
ఈ సినిమా సంగతి ఎలా ఉన్న ఈ మొత్తం మూవీతో లాభపడింది ఒక్క త్రిష అనే చెప్పాలి. అందం నుంచి అభినయం వరకూ ఆమె చిత్రంలో పూర్తి ఎఫర్ట్ పెట్టింది. మెజారిటీ ప్రేక్షకులు త్రిష యాక్టింగ్ అధిరిపోయిందని చెప్పడం విశేషం. ఇక మూవీ ప్రమోషన్ లో కూడా ఈ బ్యూటీ తెగ ఆకట్టుకుంది. పార్ట్ – 1 టైంలో ఆమెనే చూసిన వీక్షకులు, పార్ట్ -2 ప్రమోషన్ లో కూడా కన్నార్పకుండా చూశారట. త్రిష ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతుంది. ఇప్పటికీ గ్లామర్ క్వీన్ ఎవరంటే త్రిషగా చెప్తున్నారు మెజార్టీ సినీ అభిమానులు.
ఇక పొన్నియిన్ సెల్వన్ లో కనిపించిన అందం మరే సినిమాలో కనిపించలేదు. ఆమెను అలా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయినట్లే తెలుస్తోంది. ఇక తన తర్వాతి సినిమా దళపతి విజయ్ తో చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. పీఎస్ తో ఫుల్ ఫాంలోకి వచ్చినట్లుంది. వరుస ప్రాజెక్టులతో తను బిజీగా ఉన్నానని చెప్తుంది ఈ హీరోయిన్.