38.5 C
India
Thursday, March 28, 2024
More

    Trolls on Jagan : జగన్ ట్వీట్ పై ట్రోల్స్.. మోదీకి మోకరిల్లాడంటూ సెటైర్లు..

    Date:

    Trolls on Jagan
    Trolls on Jagan

    Trolls on Jagan : ఏపీ సీఎం జగన్ కు మరో ఏడాది ఎన్నికల సమరం ఉంది. ఈ సారి ఆయనకు రాష్ర్టంలో ఫైట్ కొంత కష్టంగానే కనిపిస్తున్నది. మరోవైపు ఆయనపై ఉన్న కేసులు, ఆయన పార్టీ కీలక నేతలపై నడుస్తున్న కేసులు వేధిస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ వైసీపీ శ్రేణుల్లో నెలకొంది. కేసులు నుంచి తప్పించుకోవడం ఎక్కువ రోజులు కుదరదని అందరికీ తెలుసు. కానీ కేంద్రంతో సఖ్యతతో ఉంటే కొన్ని రోజులు ఎలాంటి రంది లేకుండా ఉండవచ్చనేది పలువురు రాజకీయ నాయకుల తీరు..

    అయితే ఇప్పుడు ఏపీ సీఎం జగన్ చేసిన ఒక ట్వీట్ రచ్చకు దారితీసింది. త్వరలో కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం ఢిల్లీలో ఉంది. దీనికి 19 విపక్ష పార్టీలు బాయ్ కాట్ చేశాయి. అయితే జగన్ ఈ కార్యక్రమానికి వైసీపీ తప్పకుండా హాజరవుతుందని, ఇదో మహత్తర కార్యక్రమమని స్పష్టం చేశాడు. ఇదే ఇతర పార్టీల నాయకుల ఆగ్రహానికి కారణమైంది. కేసుల నుంచి తప్పించుకోవడానికే మోదీ కాళ్ల మీద పడుతున్నాడని సెటైర్లు విసురుతున్నారు. అయితే జగన్ తమ పార్టీ వరకు చెప్పుకొని వదిలేస్తే బాగుండేది. ఇంత మంచి కార్యక్రమాన్ని బహిష్కరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తి అనిపించుకోదు అని అన్నారు. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి అన్ని పార్టీలు హాజరవ్వాలని సుద్దులు చెప్పాడు. ఇదే ఇతర పార్టీల నేతల కోపానికి కారణమైంది.

    కేసుల కోసం బీజేపీ నేతల చుట్టూ తిరిగే పరిస్థితి మాకు లేదని, తాను హాజరు కావాలంటే హాజరు కావచ్చని కాని ఇతరులకు నీతులు చెప్పడమేంటని మండిపడుతున్నారు. రాజకీయాల్లో అసలు వ్యక్తిత్వం లేని వ్యక్తి కూడా మాటలు చెబితే నవ్వి పోదురు గాక నాకేంటి అన్నట్లు ఉంటదని సెటైర్లు విసురుతున్నారు. ఏదేమైనా వైసీపీ అధినేత ముందు తన పార్టీ సంగతి చూసుకోక ఇతరులకు నీతులు చెప్పడంపై మండిపడుతున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి అంశం ఇప్పుడు తుది దశకు చేరుకోవడంతో బీజేపీ అగ్రనేతలను మచ్చిక చేసుకోవడంలో భాగంగానే ఇదంతా చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. మరి సీఎం జగన్ దీనిని  ఎలా తీసుకుంటారో.. చూడాలి.

    Share post:

    More like this
    Related

    Election King : 238సార్లు ఓడినా.. మళ్ళీ పోటీ కి సిద్ధం అయిన.. ఓ నాయకుడు..! 

    Election King : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన...

    Congress : ఈనెల 30న కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి? 

    Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే...

    Punjab CM : 50 ఏళ్ల వయసులో తండ్రి అయిన పంజాబ్ ముఖ్యమంత్రి..

    Punjab CM : పంజాబ్ సీఎం భగవoత్  సింగ్ మాన్ 50...

    Chandrababu : సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు 7 ప్రశ్నలు..

    Chandrababu : 90 శాతం హామీలు నెరవేర్చమని చెప్పుకునే సీఎం జగన్మోహన్...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు 7 ప్రశ్నలు..

    Chandrababu : 90 శాతం హామీలు నెరవేర్చమని చెప్పుకునే సీఎం జగన్మోహన్...

    Sajjala Ramakrishna : మోడీతో జగన్ సంబంధాలపై సజ్జల రామకృ ష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..

    Sajjala Ramakrishna : మోడీతో జగన్ కు ఉన్నది ప్రభుత్వ పరమైన...

    Jagan-Modi : జగన్ మోడీకి లొంగిపోయి పన్ను భారాన్ని ప్రజలపై వేశారు..? 

    Jagan-Modi : బిజెపి, వైసిపి పాలనలో ఇంటి పన్ను భారం ప్రజలపై...

    Jagan Yatra : ఈనెల 27వ తేదీ నుంచి జగన్ యాత్ర ప్రారంభం

    Jagan Yatra : ఈనెల 27వ తేదీన ఏపీ సీఎం జగన్మోహన్...