
UPI Transactions : భారత్ లో డిజిటల్ చెల్లింపులకు విప్లవం తెచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ఇప్పుడు కొత్త రూల్స్ తో వార్తల్లో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం UPI ద్వారా ₹2000 కంటే ఎక్కువ మొత్తంతో జరిగే ఒక్కో చెల్లింపుపై గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) విధించాలని ప్రతిపాదిస్తోంది. ఈ నియమం అమలులోకి వస్తే.. రోజువారీ డిజిటల్ లావాదేవీలపై, ముఖ్యంగా చిన్న వ్యాపారులు, ఫ్రీలాన్సర్లు, మధ్యతరగతి కుటుంబాలపై ప్రభావం పడనుంది.
ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిశీలనలో ఉంది. ఇది కనుక అమలైతే మాత్రం ₹2000 పైన జరిగే UPI చెల్లింపులపై 18% GST వసూలు చేయవచ్చు. ఈ రుసుము సర్వీస్ ఛార్జీలపై.. అంటే పేమెంట్ అగ్రిగేటర్లు (PhonePe, Paytm వంటివి) వసూలు చేసే ఫీజులపై వర్తిస్తుంది, లావాదేవీ మొత్తంపై కాదు.
ఉదాహరణకు ₹2000 లావాదేవీపై 1% సర్వీస్ ఫీ (₹20) ఉంటే, దానిపై 18% GST (₹3.6) వసూలవుతుంది. ఈ ఛార్జీలు వ్యాపారులపై పడతాయి. అయితే వారు ఈ భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయవచ్చు. వ్యక్తిగత (P2P) లావాదేవీలు.. అంటే స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల మధ్య బదిలీలు ఈ GST నుండి మినహాయింపు లభించవచ్చు.
అయితే ఈ కొత్త రూల్ UPI యొక్క ఉచిత సౌలభ్య స్వభావాన్ని ప్రభావితం చేయవచ్చని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరీ రూల్ పై పూర్తి సమాచారం తెలియాలంటే మాత్రం GST కౌన్సిల్ నుండి అధికారిక నిర్ధారణ కోసం ఎదురుచూడాల్సిందే..!