ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకవైపు #OG చేస్తూనే మిగిలిన ప్రాజెక్టులపై ఒక నజర్ వేశాడు. ఇటీవల #OG రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 8వ తేదీతో పూర్తవుతుంది. తర్వాత ఆయన ఏ ప్రాజెక్టులోకి వెళ్తారన్న ఆసక్తి ఆయన అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా కలిగింది. అయితే తను ప్రస్తుతం #OG, హరిహర వీరమల్లు, Ustaad Bhagat Singh, మరో ప్రాజెక్టు త్రివిక్రమ్ తో స్ర్కిప్ట్ డిస్కర్షన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే #OG మొదటి షెడ్యూల్ పూర్తవడంతో. కొంత గ్యాప్ తర్వాత ఆయన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ డైరెక్టర్ హరీశ్ శంకర్ కు కాల్ షీట్లు ఇవ్వనున్నారు.
పవన్ కళ్యాణ్ డైరెక్టుర్ హరీశ్ శంకర్ కు కాల్ చేసి తర్వాత కాల్ షీట్లు ఇస్తానని చెప్పారు. అయితే పవన్ హీరోగా, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తున్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ కూడా ఇప్పటికే చాలా పోర్షన్ పూర్తయింది. ఆ సినిమాకు కాల్ షీట్లు ఇవ్వకుండా ‘ఉస్తాద్ భగత్ సింగ్’కు కాల్ షీట్లు ఇస్తున్నారట. ఈ నేపథ్యంలో హరీశ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 8న #OG షూటింగ్ పూర్తవగానే 8 రోజులు రెస్ట్ అనంతరం 16వ తేదీ నుంచి హరీశ్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ కు కాల్ షీట్లు ఇస్తున్నట్లు చెప్పారు పవన్ కళ్యాణ్.
ఏఎం రత్నం ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిత్రం షూటింగ్ వేగంగా కొనసాగాలని పవన్ హరీశ్ ను కోరారట. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కాలం సమీపిస్తున్నందున అందుకు కూడా సమయం కేటాయించాలని చెప్పారట. దానికి తగ్గట్లు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ చేసుకోనున్నారు. అయితే లెటెస్ట్ గా వచ్చిన అప్ డేట్ ప్రకారం.. వపన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కు సంబంధించి గ్లింప్స్ 11వ తేదీన రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అయితే ఇదే రోజు హరీశ్ శంకర్ దర్శకత్వంలో 11 సంవత్సరాల క్రితం గబ్బర్ సింగ్ రిలీజై 11 సంవత్సరాలు కూడా పూర్తవుతున్నాయి. అందుకే అదే రోజు గ్లింప్స్ ను రిలీజ్ చేసి పవన్ ను షాక్ గురి చేయాలని అనుకుంటున్నాడట హరీశ్ శంకర్.
హరీశ్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ భారీ విజయాలను సొంతం చేసుకుంది. ఇద్దరికి ఇది మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా. ఈ కాంబినేషన్ నుంచి వస్తున్న మరో సినిమా ‘ఉస్తాద్ గబ్బర్ సింగ్’ కాబట్టి చిత్ర యూనిట్ దీనిపై అనేక ఆశలు పెట్టుకుంది.