
Visakha Kidnap case : విశాఖలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే పోలీసులు రంగంలోకి దిగి కేవలం 4గంటల్లోనే కిడ్నాప్ కథకు ముగింపు పలికారు. దీంతో ఎంపీ కుటుంబంతోపాటు ఆయన అభిమానులు అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి.. కుమారుడు కిడ్నాప్.. ఆడిటర్ జీవీతోపాటు మరో ఇద్దరిని దుండగులు కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లలో ప్రధాన నిందితుడు హేమంత్ గా గుర్తించిన పోలీసులు కొద్ది గంటల్లోనే కేసును చేధించారు. 17 బృందాలుగా ఏర్పడి పోలీసులు కిడ్నాపర్లను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎంపీ కుటుంబాన్నే కిడ్నాపర్లు ఎందుకు టార్గెట్ చేసారనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది.






