వయోసైటిస్ కు గురైన సమంత ఇప్పుడిప్పడే కోలుకుంటుంది. కానీ ఈ వ్యాధి దీర్ఘకాలికంగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల చిట్టిబాబు సమంతపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘సమంతకు ఎలాంటి అనారోగ్యం లేదని ఇదంతా తనపై సింపతి పెంచుకునేందుకే’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి కూడా ఆమె చిట్టిబాబుకు గట్టిగానే సమాధానం చేప్పారనుకోండి. సమంత మరో సారి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని కనిపించింది. అసలు సమంతకు ఏమైంది అంటూ నెటిజన్ల నుంచి ప్రశ్నల వర్షం కురుస్తోంది.
తను వయోసైటిస్ వ్యాధికి గురైనట్లు 2022లో సమంత ప్రకటించింది. సంవత్సరం నుంచి ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటుంది. చాలా నీరసించి పోయానని గతంలో సోషల్ మీడియా వేధికగా వివరించింది. దీంతో తన అభిమానుల్లో కలవరపాటు మొదలైంది. చాలా కాలం ఇంటికే పరిమితమైన ఆమె అనారోగ్యంగా ఉన్న సమయంలోనే ‘యశోద’ చేసింది. లేడీ ఓరింయటెడగా వచ్చిన ఆ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఈ నేపథ్యంలో ఆక్సిజన్ మాస్క్ ధరించి సమంత ఒక పిక్ ను సోషల్ మీడియా వేదికగా ఇటీవల పోస్ట్ చేసింది. దీన్ని చూసిన అభిమానులు మళ్లీ ఏమైందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై ఆమె స్పందిస్తూ తను హైపర్బేరిక్ థెరపీ తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ ట్రీట్ మెంట్ కండరాలకు మంచిదంటూ చెప్తున్నారు ఆమె.
ఎందుకీ హైపర్బేరిక్ థెరపీ..
వయోసైటిస్ వ్యాధి కండరాలకు సోకుతుంది. వ్యాధి గురైన వారి కండరాలు మెల్లమెల్లగా చచ్చుబడుతూ ఉంటాయి. అయితే హైపర్బేరిక్ థెరపీ తీసుకుంటే డ్యమేజైన కండరాలకు తిరిగి జీవం పోస్తుంది. దీంతో పాటు ఇన్ఫెక్షన్ కలగకుండా చూస్తుంది. అందులో ఈ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు చెప్తుంది. బహుషా చిట్టిబాబు ఆరోపణల నేపథ్యంలో ఈ ఫొటోతో సమాధానం చేప్తాలనుకున్నారోమో.
ఏది ఏమైనా ఆమె త్వరగా కోలుకోవాలని అందరూ చూస్తున్నారు. ఆమె ప్రస్తుతం సిటాడెల్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇది అమేజాన్ ప్రైమ్ లోకి త్వరలో రాబోతుంది. దీంతో పాటు రౌడీబాయ్ విజయ్ తో కలిసి కుషి చేస్తుంది. ఇది సెప్టెంబర్ లో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపారు.