వైఎస్ ఫ్యామిలీ విబేధాలకు కారణం ఏంటి.
సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఆ కటుంబానిది. కొన్ని లక్షల ప్రజలకు ఆ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు.. అయితే భారీగా బలగం.. అందరికీ రాజకీయ అనుభవం ఉండడమే ఆ కుటుంబానికి అతి పెద్ద బలం.. కానీ ఇప్పుడు బలమే బలహీనమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే.. ఆప్యాయతలకు అనుబంధాలకు పెట్టింది పేరు.. ఆ కుటుంబానికి చెందిన వారినే కాదు.. తమతో కలిసి పని చేసే వాళ్ళని కూడా సొంత కుటుంబ సభ్యుల మాదిరి చూసుకుంటారని పేరు ఉంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైఎస్ కుటుంబంలోని విబేధాలు భయటపడ్డాయి. వైఎస్ మరణం తర్వాత సీఎం పదవి కోసం సంతకాలు సేకరించి తండ్రి వారసత్వంగా వచ్చిన సీఎం కుర్చిలో కూర్చోవాలని చూశారు వైఎస్ జగన్. కానీ అప్పటీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జగన్ ను కాదని అర్థిక మంత్రిగా అనుభవం ఉన్న కొణిజేటి రోశయ్యను సీఎంగా ప్రకటించారు. ఒక సంవత్సరం తర్వాత స్పీకర్ గా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.తనకు సీఎం పదవీ దక్కక పోవడంతో అసహనానికి గురైన జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, వైఎస్సాఆర్ సీపీ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే జగన్ సొంత కుంపటి పెట్టడంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడైన వైఎస్ వివేకానందరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. అప్పుడే వైఎస్ ప్యామిలీలో విబేధాలు భగ్గుమన్నాయి.