
Delhi elections : విభిన్న రాష్ట్రాల్లో వ్యూహపరమైన పొరపాట్లు, ప్రత్యర్థి పార్టీలతో అనవసరంగా పోటీ పడటం, నిజమైన ప్రత్యర్థి ఎవరో గుర్తించడంలో అసమర్థత ఇవి అన్నీ కాంగ్రెస్ పార్టీని వెనుకకు నెట్టుతున్న అంశాలు.
ప్రస్తుతం భారత రాజకీయాలలో బీజేపీతో పోటీ చేయాలంటే, విభజన కాదు, ఐక్యత అవసరం. కానీ కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పోటీ పడుతూ, వారి బలం తగ్గించడానికి ప్రయత్నిస్తూ, అలాగా బీజేపీకి పరోక్షంగా లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తోంది. ఢిల్లీలో ఇది స్పష్టంగా కనిపించింది. కేజ్రివాల్ పార్టీతో కలిసి పనిచేయకపోవడం వల్ల బీజేపీకి ప్రత్యక్ష లాభం కలిగింది. బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్ల తేడా కేవలం 2 శాతమే ఉంది. అదే కాంగ్రెస్ కు 6 శాతం ఉంది. ఆప్ కాంగ్రెస్ కలిస్తే.. వీరే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా కలవకుండా ఇలా ఓటమి తెచ్చుకున్నారు.
చాలా మంది ప్రవాస భారతీయులు కూడా ఇదే రీతిగా కాంగ్రెస్ వ్యూహాన్ని తప్పుబడుతూ, ఇది బీజేపీని మరింత బలపరిచే విధంగా ఉన్నదని భావిస్తున్నారు. ముఖ్యంగా 2024 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఎదగాలంటే, అది బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రజలకు నమ్మకం కలిగించగలిగే విధంగా పనిచేయాలని సూచిస్తున్నారు..
ఆంధ్రాలో జగన్ ను దెబ్బతీస్తే చాలు కాంగ్రెస్ బలపడుతుంది. అలానే ఉత్తరప్రదేశ్ లో ములాయం పార్టీని, బెంగాల్ లో మమతను, ఢిల్లీలో కేజ్రవాల్ ను ఇలా అందర్నీ దెబ్బతీస్తే చాలు. ఇటువంటి పరిణతి లేని ఆలోచనలతో కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రాష్ట్రంలో సున్నా సీట్లకు పడిపోతుంటే బాధ వేస్తుంది
కాంగ్రెస్ పార్టీ బీజేపీ గెలుపుకు సహకరించటం తప్ప వేరే ఏ పని చేయటం లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఎవరి మీద చేయాలి, దేనిమీద చేయాలి అనే మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా తయారు అయింది. ప్రతీ ఎన్నికల్లోనూ బీజేపీని గెలిపిస్తోంది.. అంటూ ఎన్నారైలు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.