Diabetes tips : ఇటీవల కాలంలో షుగర్ వేగంగా వ్యాపిస్తోంది. చాప కింద నీరులా విస్తరిస్తోంది. కానీ ముందే జాగ్ర్తత్తలు తీసుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఫలితంగా దాని బారిన పడ్డాక బాధపడుతున్నారు. ముందే మేల్కొంటే బాగుండు అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరి ముఖ కవలికలు బట్టి ముందే హెచ్చరిస్తుంటారు. కానీ మనం లెక్కచేయం. దీంతో అనర్థాలు రావడం ఖాయం.
షుగర్ వచ్చిందంటే చాలు మందులు మింగడం మొదలవుతుంది. ఉదయం ఒక మాత్ర, సాయంత్రం మరో మాత్ర వేసుకుంటూ కాలం గడపాల్సిందే. దీనికి తోడు బీపీ తోడయితే ఇక మందుల మోతే. రోజుకు ఐదారు బిళ్లలు వేసుకుంటూ మన జీవితాన్ని కొనసాగించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో డయాబెటిస్ వస్తుందనే లక్షణాలు ముందే మనకు కనిపిస్తాయి. దీంతో మనం జాగ్రత్తలు తీసుకుంటే సరి.
కానీ మనం చేతులు కాలాక ఆకులు పట్టుకుంటాం. రోగం మన దాకా వస్తే కానీ చికిత్స తీసుకోం. మందుల జోలికి వెళ్లం. ఇలా షుగర్ మన జీవితంలో ఒక భాగంగా మారింది. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. గుండె, కిడ్నీ, కళ్లు, లివర్ వంటివి దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. దీంతో మనం జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతి. ప్రాణాలు గాల్లో కలవాల్సిందే.
ఇంతటి మహత్తర ప్రాణాంతకమైన వ్యాధిని నిర్లక్ష్యం చేయకూడదు. రాక ముందే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. రోజు సాయంత్రం చపాతీ తినాలి. మధ్యాహ్నం ఆకుకూరలు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన రోగ నిరోధక వ్యవస్థ బాగుంటుంది. రోగాలు రాకుండా చేస్తుంది. ఇలా మన ముందస్తుజాగ్రత్తలు మనకే మంచి చేస్తాయి.