
Pawan Kalyan : అభిమానుల పదేళ్ల కల ఫలించింది. తమ అభిమాన కథానాయకుడు వపర్ స్టార్ పవన్ కల్యాన్ రాజకీయాల్లోనూ పవర్ చూపించాడు. సినిమాల్లో తనదైన స్టైల్స్, మేనరిజమ్, నటనతో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటన్న పవన్ కల్యాన్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. తన మార్క్ తో రాజకీయాల్లో సరికొత్త పంథాలో పయనిస్తున్నారు.
అవకాశం ఉన్నా.. అనుభవం లేదని..
2008లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం రాష్ర్ట అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. కానీ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2014లో పార్టీ పెట్టిన పవన్ కల్యాన్ ఆ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీతో జనసేన కట్టింది. తాను తల్చుకుంటే కేంద్రంలో, రాష్ర్టంలో మంత్రి పదవి చేపట్టే అవకాశం ఉన్నా వద్దనుకున్నాడు. తనకు మరింత అనుభం కావాలని సున్నితంగా తిరస్కరించాడు. 2019లో పోటీ చేసిన పార్టీ ఘోర వైఫల్యంతో అసెంబ్లీకి కూడా వెళ్లలేకపోయాడు. కానీ జనాల మధ్యే ఉండి వాళ్లకు ఏం కావాలో తెల్సుకున్నాడు. వాటిపైనే అధికార పార్టీపై యుద్ధం చేశారు.
ఇక పిఠాపురంఎమ్మెల్యే తాలూకా..
మొన్నటి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాన్ పిఠాపురం ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలోని కేసరపల్లి వేదికపై గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో పవన్ కల్యాణ్ తొలిసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. తొలిసారి చట్టసభలకు వెళ్తున్నారు జనసేన అధినేత. మంత్రిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతుండడంతో ఆభిమానుల్లో ఆనందం పొంగిపొర్లుతున్నది. వేదికపై పవన్ కల్యాణ్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అభిమానుల కేరింతలతో కేసరపల్లి దద్దరిల్లిపోయింది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీనడ్డాతో పాటు పలువురు ముఖ్య నేతలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. పలు రాష్ట్రాల సీఎంలు కూడా ఈ వేదికను అలంకరించారు.
హాజరైన కుటుంబ సభ్యులు
పవన్ కల్యాన్ మంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి మెగా కుటుంబమంతా తరలివచ్చింది. ప్రమాణ స్వీకారాన్ని తిలకించి మెగా కుటుంబం సంతోషంలో మునిగితేలింది. కాగా ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి రాష్ర్ట ముఖ్య అతిథి హోదాలో వచ్చారు.