34.7 C
India
Monday, March 17, 2025
More

    ఉమ్మడి పౌరస్మృతి ఎందుకు.. ఎవరికోసం..?

    Date:

    భారత దేశం భిన్నత్వంలో ఏకత్వం.. ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నదే. గొప్పగా చెప్పుకుంటాం. ఎన్నో కులాలు, మతాలు, భాషలు మన దేశంతో బంధాన్ని పెనవేసుకొని ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరికీ గుర్తింపు, గౌరవం ఉంటుంది. ఇతర మతాల్ని, మతాచారాల్ని, అలవాట్లను ఏ ఒక్కరూ కించపర్చకూడదు. అయితే దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చే సంకల్పంతో వన్ నేషన్ – వన్ ఎజెండా అనే నినాదంతో కేంద్రలోని బీజేపీ దృష్టి పెట్టింది. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండగా, ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల ప్రధాని మోదీ భోపాల్‌లో ఇదే అంశంపై మాట్లాడారు.

    బీజేపీ పైనే అనుమానాలు
    అయితే ఇక్కడ ఒకే దేశం.. ఒకే చట్టాన్ని వ్యతిరేకంచలేం కావచ్చు. దీని వల్ల కూడా ఎన్నో ఉపయోగాల ఉన్నాయి. అయితే ఇక్కడ గుర్తించాల్సింది అమలు చేస్తామని చెబుతున్న బీజేపీ నాయకుల గత చరిత్రే. ఒక వర్గాన్ని టార్గెట్ చేసుసుకుని ప్రస్తుతం వీరంతా రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికల్లో లబ్ది పొందాలనే ప్రయత్నమే ఇదని కొందరి అభిప్రాయం కూడా. ఆరెస్సెస్ ఒక్కో నినాదాన్ని అమలు చేస్తూ వస్తున్న ప్రధాని మోదీ, భారతీయ జనసంఘ్‌ నినాదాన్ని ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు. ఇది బీజేపీ మేనిఫెస్టోలో ప్రతీ సారి ఉంటున్నా, తొమ్మిదేళ్లుగా ఎలాంటి అడుగులు పడలేదు. మళ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు తెరపైకి తెచ్చింది. ఒక దేశంలో కొందరికి రెండు చట్టాలు ఎందుకు వర్తించాలన్నది బీజేపీ ప్రధాన వాదన. ఈ ఏడాది ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు, వచ్చే ఏడు సార్వత్రిక ఎన్నికల కారణంగా ఈ వాదనను మరోసారి తెరపైకి తెచ్చింది కేంద్రం. ఉమ్మడి పౌర స్మృతి ఈ దశలో అవసరం లేదని లేదా వాంఛనీయం కూడా కాదని స్పష్టంగా చెబుతూ 2018లో 21వ లా కమిషన్‌ ఒక సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. అయితే ఇదంతా పట్టించుకోకుండా మళ్లీ కేంద్రం ఈ విషయాన్ని తెరపైకి తెచ్చిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటులో మెజారిటీ ఉండడంతో, పార్టీ అజెండాను పక్కాగా అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరుగుతున్నది. ముమ్మారు తలాక్‌ చెప్పే విధానాన్ని రద్దు చేశారు.

    ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్  తెచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతున్నది. దేశంలో ఇప్పుడు కొన్ని అంశాల్లో అందరికీ ఒకే చట్టం లేదు – ముఖ్యంగా వివాహ చట్టాలు.. దేశంలో ప్రజా చట్టాలకు భిన్నంగా మతపరమైన చట్టాలున్నాయి. హిందూ వివాహ, వారసత్వ చట్టాలు, షరియా లాంటి ముస్లిం పర్సనల్ చట్టాలు అమలవుతున్నాయి. ట్రిపుల్ తలాక్ వంటి వివాదాలు ఈ కారణంగానే వస్తున్నాయి. మతపరమైన అచారాలు, సంప్రదాయాలకు అతీతంగా భారత భూభాగం పరిధిలో ఉన్న పౌరులందరికీ ఒకే చట్టాన్ని వర్తింపజేయడం ఉమ్మడి పౌరస్మృతి లక్ష్యం. మత చట్టాలను రద్దు చేసి.. యూనిఫాం సివిల్ కోడ్ ద్వారా అందరికీ అన్ని అంశాల్లో వర్తించే చట్టాలను తీసుకు రావాలని కేంద్రం భావిస్తోంది. అంటే.. ఇక్కడ ఇకపై మతాల చట్టాలు చెల్లవు. పెళ్లి, దత్తత, వారసత్వ హక్కుల్లో ఒకే విధానం. దేశవాసులందరికీ ఒకే రాజ్యాంగం వర్తిస్తుంది.  ఉమ్మడి వివాహ చట్టం అమల్లోకి వస్తుంది. ఇందులో వివాదాలకు తావు లేదు.

    అయితే ఉమ్మడి పౌరస్మృతి అమలుకు అనువైన వాతావరణం ఉండాలి. ఏ వర్గాన్ని ఇబ్బంది పెట్టకూడదు. క్రైస్తవులు ఎక్కువగా ఉండే నాగాలాండ్, మిజోరం లాంటి రాష్ట్రాలు తమకంటూ ప్రత్యేకమైన సివిల్ చట్టాలను రూపొందించుకున్నాయి.  హిందువుల్లో.. కొడుకులతో సమానంగా కూతుళ్లకు వారసత్వ ఆస్తిలో వాటా పొందేలా 2005లో చట్టాలను సవరించారు. కానీ.. దీనికంటే ముందే ఐదు రాష్ట్రాలు.. మహిళలకు వారసత్వ ఆస్తిలో వాటా హక్కును కల్పిస్తూ చట్టాలు చేశాయి. ఉమ్మడి పౌరస్మృతిని కేవలం ముస్లింలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారన్న ప్రచారం జరిగింది. కానీ హిందువులు, క్రైస్తవులు కూడా వ్యతిరేకిస్తున్నారని చెబుతూంటారు. దేశ సమైక్యత కోసం యూనిఫాం సివిల్ కోడ్ ఉండాలని సుప్రీంకోర్టు చెబుతున్నది. అందరికీ ఆమోదయోగ్యంగా యూనిఫాం సివిల్ కోడ్ ను అమల్లోకి తీసుకు వస్తే పర్వాలేదు. కానీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తే దీర్ఘ కాలలో దేశానికి చేటు చేసినట్లవుతుంది.

    Share post:

    More like this
    Related

    Journalists Revathi : జర్నలిస్ట్ రేవతి, తన్వి యాదవ్ కు బెయిల్

    Journalists Revathi Bail : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆయన...

    betting : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు

    betting : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా...

    Manipur : మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన.. మోడీ ట్రీట్ మెంట్ ఇట్లుంటదీ

    Manipur : మణిపూర్ ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో,...

    Sunita and Wilmore : అంతరిక్షంలో ఉన్నందుకు సునీత, విల్మోర్ కు వచ్చే జీతభత్యాలు ఎంతంటే?

    Sunita and Wilmore : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎనిమిది రోజుల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BJP : బీజేపీ వైపు రేవంత్ రెడ్డి చూస్తున్నారా?

    ఇంటర్వ్యూలో నిజాలు బయటపెట్టిన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో...

    Delhi elections : ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పై NRI లు ఏమన్నారంటే..

    Delhi elections : విభిన్న రాష్ట్రాల్లో వ్యూహపరమైన పొరపాట్లు, ప్రత్యర్థి పార్టీలతో అనవసరంగా...

    BJP : బీజేపీలోకి విజయసాయి కుమార్తె..!

    AP BJP : తెలుగు రాష్ట్ర రాజకీయాలలో విజయసాయి రెడ్డి వేస్తున్న అడుగులు.....

    Delhi elections : ఢిల్లీ ఎన్నికలు : ఐదు గ్యారెంటీలతో కాంగ్రెస్ మేనిఫెస్టో!

    Delhi elections : మరో వారం రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి....