
Team India New coach : ఎట్టకేలకు భారత జట్టు కొత్త ప్రధాన కోచ్ పేరును ప్రకటించారు. బీసీసీఐ సెక్రటరీ జై షా కొత్తకోచ్ పేరును ఎక్స్ (ట్విట్టర్)లో ప్రకటించారు. రాహుల్ ద్రావిడ్ వారసుడిగా గౌతమ్ గంభీర్ ను ప్రకటించారు. టీమ్ ఇండియా తదుపరి కొత్త ప్రధాన కోచ్ బాధ్యతలను స్వీకరించనున్నారు. టీ20 ప్రపంచ కప్ 2024లో భారత జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. రాహుల్ ద్రవిడ్ కోచ్ పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత తదుపరి ప్రధాన కోచ్ పేరు ఎవరనే విషయమై కొద్ది రోజులుగా క్రికెట్ క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీమిండియా జూలై చివరిలో శ్రీలంకలో మూడు టీ20. మూడు వన్డే సిరీస్ ఆడనున్నది. శ్రీలంక పర్యటనతో గంభీర్ టీమిండియా కోచ్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించనున్నాడు.
జై షా ట్వీట్
టీమ్ ఇండియా కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్ను బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్ చేశారు. టీమ్ ఇండియా కొత్త ప్రధాన కోచ్గా నియమించడం చాలా సంతోషంగా ఉందని తన ట్వీట్లో రాశారు. ఆధునిక క్రికెట్ చాలా వేగంగా అభివృద్ధి చెందింది. అందుకే మనం కూడా అదే ఆలోచనతో ఎదురు చూస్తున్నాం. టీమ్ ఇండియా కొత్త ప్రధాన కోచ్ నాయకత్వంలో భారత క్రికెట్ ముందుకు సాగుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. అతనికి బీసీసీఐ నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. గంభీర్ కొత్త ప్రయాణానికి మేము అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అని తన ట్వీట్ లో పేర్కొన్నారు.
వచ్చే ఏడాదిలో ఐసీసీ ట్రోఫీ గెలుపే లక్ష్యంగా..
టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచిన తర్వాత టీమ్ ఇండియాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తదుపరి లక్ష్యం వచ్చే ఏడాదిలో రెండో ఐసీసీ ట్రోఫీని గెలుచుకోవడం. కొత్త ప్రధాన కోచ్పై ఈ బాధ్యత సవాల్ గా మారనుంది. 2025 సంవత్సరం ప్రారంభంలో టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాల్సి ఉంది.