34.7 C
India
Friday, April 10, 2026
More

    పొత్తులతో జనసేనకు కలిసొచ్చేనా..?

    Date:

    Chandrababu-Pawan Kalyan meeting: Tremors in political circles
    Chandrababu-Pawan Kalyan

    జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కాపు కులస్తులు కోరుకుంటున్నారు. కానీ జనసేన పార్టీ రాబోయే ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ సాధించే అవకాశాలేవని పార్టీ నాయకులే బహిరంగంగా చెబుతున్నారు. అయితే టిడిపితో గాని బిజెపితో గాని పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడొచ్చని పలువురు జనసేన నాయకులు  భావిస్తున్నారు. ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి తో భేటీ అవడం, మరోపక్క చంద్రబాబు నాయుడుతో భేటీ అవడంతో ఎవరితో లాభం.. ఎవరితో నష్టం అని కాపులు సందిగ్ధంలో పడిపోయారు. టిడిపి తో పొత్తు పెట్టుకుంటే 50 శాతం సీట్లు జనసేన పార్టీకి ఇవ్వాలని అందులో ని ముఖ్య నాయకుడు పేర్కొనడం గమనార్హం. మరోపక్క టిడిపి సీనియర్ నాయకులు 50 శాతం సీట్లు జనసేనకు ఇవ్వడం సాధ్యం కాదని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. దీంతో జనసేన లో ఉన్న కాపులు అయోమయానికి గురవుతున్నారు.

     టిడిపి పొత్తుతో జనసేనకు నష్టం..
    టిడిపితో పొత్తు పెట్టుకుంటే జనసేనకు చాలా నష్టమని రాజకీయ విశ్లేషకులు,పార్టీ ముఖ్య నాయకులు పేర్కొంటున్నారు. జనసేన ను నమ్ముకొని ఉన్న కాపులు ఆశపడుతున్నట్టుగా 50 శాతం సీట్లు గాని, గౌరవప్రదమైన పదవులు,  కొంత పవర్ గాని టిడిపితో పొత్తు పెట్టుకుంటే ఉండవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

     బీజేపీతో కొంత బెటర్..
    రాబోయే ఎన్నికల్లో జనసేన బీజేపీ తో  కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే కొంత బెటర్ గానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బిజెపి తో కలసి పోటీ చేస్తే 25 నుండి 40 సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని పార్టీ ముఖ్య నాయకులు భావిస్తున్నారు. అయితే తాము ఆశించిన పదవులు, కొంత మేరకు వస్తాయని, అలాగే గౌరవం కూడా ఉంటుందని డమినేషన్ కూడా పవన్ కళ్యాణ్ దే ఉంటుందని ముఖ్య నాయకులు వాపోతున్నారు.

     ఒంటరిగా పోటీ చేస్తేనే సీఎంకు చాన్స్..
    రాబోయే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే 25 సీట్లు వస్తాయని పార్టీ ముఖ్య నాయకులు పేర్కొంటున్నారు. టిడిపి బిజెపికి సీఎం కావడానికి సంపూర్ణ మెజారిటీ రాదని టిడిపి, వైసిపి ఎప్పుడూ ఒక్కటి కావని..అప్పుడు ఎవరో ఒకరు జనసేనకు మద్దత్తు ఇస్తారని అప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉంటుందని కాపులు భావిస్తున్నారు.
    జనసేన రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగడమే మేలని అప్పుడే తగిన గౌరవం సమాన అవకాశాలు ఉంటాయని జనసేన పార్టీ ముఖ్య నాయకులు వాపోతున్నారు. లేకపోతే పార్టీ మరుగున పడే అవకాశం ఉంటుందని తెగేసి చెప్పేస్తున్నారు.ఏది ఏమైనా  జనసేన పార్టీ టిడిపి,బిజెపి  ఇచ్చే ఆఫర్లకు లొంగి పొత్తులకు సై అంటుందా.. లేక ఒంటరిగానే బరిలోకి దిగుతుందా  వేచి చూడాల్సినందే..!

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    Chandrababu : చంద్రబాబుపై దాడి చేసిన వ్యక్తి కథ

    Chandrababu : భారీ ఎన్కౌంటర్లో మరణించిన నక్సలైట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్...

    Sajjala : సజ్జల టార్గెట్: రూ.220 కోట్ల భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు

    Sajjala : ఏపీలో రాజకీయ వేడి పెరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ కీలక నేత...

    Chandrababu : చంద్రబాబు గారి సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం

    Chandrababu : రాష్ట్రంలో ఒక గొప్ప యజ్ఞం నడుస్తోంది. ఆ యజ్ఞ సారథి...