Polavaram : ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ పనులు నత్త నడకన సాగుతున్నాయి. గత ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ పోలవరాన్ని ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదు. ఇప్పుడు మరో రెండేళ్లు పడుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. గత ప్రభుత్వ హాయంలో జరుగుతున్న పనులను రివర్స్ టెండరింగ్ పేరుతో ఆపేశారు. పనులు చేపడుతున్న గుత్తేదారును తొలగించారు ఆ తర్వాత మేఘ అనే కంపెనీకి కట్టబెట్టారు. ఇక అప్పటినుంచి పనులు నత్త నడకనే సాగుతున్నాయి.
పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతూ ఉండడంతో నిర్మాణ వ్యయం ఏడాది కేడాది పెరుగుతూనే ఉంది. అతి తక్కువకు నిర్మిస్తామని టెండర్ దక్కించుకున్న మెఘా కంపెనీ ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేసింది. గత ప్రభుత్వం పోలవరం పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ స్పీడ్ చేసినా ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఎన్నో ఆరోపణలు చేశారు. ఇప్పుడు తను నాలుగేళ్లుగా టైం పాస్ చేస్తున్నారు. మరో రెండేళ్లు కావాలని కోరుతున్నారు
రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టిన జగన్ కావాలనే పోలవరం నిర్మాణాన్ని జాప్యం చేస్తున్నారని టిడిపి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఏపీ జీవం నాడీ అయిన పోలవరాన్ని జాప్యం చేయడమే లక్ష్యంగా ఆయన పెట్టుకున్నట్లుగా పేర్కొంటున్నది. ఇక పోలవరం కథ ముగిసినట్లేనని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అటు కేంద్రం కూడా దీనిపై పట్టించుకోకపోవడం శోచనీయమని మండిపడుతున్నారు. మరి రానున్న ఎన్నికల్లో పోలవరం కూడా ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారే అవకాశం ఉన్నది. మరి ప్రజల నిర్ణయం ఎలా ఉందో 2024 ఎన్నికల తర్వాత తేలనుంది.