
Will there be Operation Lotus in Karnataka : కర్ణాటకలో బీజేపీ వ్యూహం దెబ్బతీసింది. అనుకున్నట్లుగానే కాంగ్రెస్ ఇప్పటి వరకూ (10 గంటలు) భారీ ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఎగ్జిటగ్ పోల్స్ అంచనాలే నిజమవుతున్నట్లు తెలుస్తోంది. చాలా చోట్ల గత బీజేపీ హాయంలోని మంత్రులు, బాగా గుర్తింపు ఉన్న నేతలు కూగా ఓటమి పాలవుతున్నారు. అయితే ఇప్పటి వరకూ కాంగ్రెస్ స్పష్టమైన ముందంజలో ఉండగా బీజేపీ వెనుకబడుతున్నట్లు తెలుస్తుంది. దాదాపు 35 సీట్ల వెనుక ఉన్నట్లు తెలుస్తోంది.
కర్ణాకటలో బీజేపీ మహారాష్ట్ర పాలసీ అవలంభిస్తుందని వార్తలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. రిజల్ట్ ఎలా ఉన్నా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ వద్ద పటిష్ట వ్యూహాలు ఇప్పటికే సిద్దంగా ఉన్నాయని కాంగ్రెస్ ఎన్నిసీట్లు గెలిచినా బీజేపీ ప్రభుత్వమే మళ్లీ ఏర్పడుతుందని వాదనలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో మొత్తం 224 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 113 కాగా ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటి ఒకటి, రెండు సీట్ల ముందంజలో కాంగ్రెస్ కొనసాగుతుంది.
కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను దాటినా జేడీఎస్, ఇతరుల నుంచి ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకొని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఒక్క రాష్ర్టం గురించి దేశాన్ని వదులుకునేలా బీజేపీ వ్యవహరించదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కర్ణాటక తీర్పు దాదాపు ఎన్నికల ముందు అందరికీ తెలిసింది. ప్రతీ సారి లా ఈ సారి కూడా ప్రభుత్వాన్ని మార్చుకున్నారు కన్నడిగులు. బీజేపీ ఆపరేషన్ లోటస్ అమలు చేస్తే ఆ ప్రభావం వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై తప్పకుండా పడుతుంది.
ఈ కోణంలో బీజేపీ ఆలోచిస్తుంది. ఎందుకంటే ప్రతీ సారి కర్ణాటకలో ప్రభుత్వం మారడం పరిపాటే.. ఈ సారి కూడా అలాగే జరగాలని అక్కడి వారు కోరుకున్నారు. అయితే ఇప్పుడు అది కాదని బీజేపీ దొంగ మార్గంలో ప్రభుత్వం ఏర్పాటు ఆ రాష్ట్రంలోని 28 లోక్ సభ స్థానాలు చేజారే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో కర్ణాటక నుంచి 25 ఎంపీ స్థానాలు బీజేపీ గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా కొంతలో కొంత 20 స్థానాలైనా ఇక్కడి నుంచి దక్కించుకోవచ్చని అధినాయకత్వం ఆసిస్తుంది.






