
Trivikram sentiment : తెలుగు సినిమా దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. రచయితగా రంగప్రవేశం చేసి దర్శకుడిగా అగ్ర నటులతో సినిమాలు చేసి తనేంటో నిరూపించుకున్నాడు. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు లతో మూడేసి సినిమాలు చేశాడు. సినిమా సినిమాకు వైవిధ్యం చూపుతూ అ అనే అక్షరంతో టైటిల్ ఉండేలా చూసుకుంటారు. అందుకే ఆయన సినిమాలన్ని అదే ధోరణిలో ఉంటాయి.
అతడు, అలవైకుంఠ పురం, అజ్ణాతవాసి, అత్తారింటికి దారేది?. అరవింద సమేత లాంటి సినిమాలు అదేకోవలోకి వస్తాయి. ఇలా త్రివిక్రమ్ తన సినిమాల్లో సెంటిమెంట్ ను పండిస్తారు. చిన్న పాయింట్ ను బేస్ చేసుకుని సినిమా కథ నడిపించడం ఆయనకే చెల్లుతుంది. త్రివిక్రమ్ తన సినిమాల్లో పెద్దగా విషయం లేకపోయినా ఏదో లాగించేస్తారు.
ఇప్పటికే పవన్ కల్యాణ్ తో మూడు సినిమాలు చేశారు. అల్లు అర్జున్ తో మూడు సినిమాలు నిర్మించారు. ఇప్పుడు మహేశ్ బాబుతో తాజాగా గుంటూరు కారం సినిమా తీస్తున్నారు. దీంతో ముగ్గురు అగ్రహీరోలతో మూడేసి సినిమాలు తీసిన సెంటిమెంట్ తో ఇప్పుడు మహేశ్ బాబుతో చేసే సినిమాను కూడా హిట్ చేయాలని భావిస్తున్నారు.
మహేశ్ బాబుతో అతడు, ఖలేజా నిర్మించారు. మూడో సినిమాగా గుంటూరు కారం తీస్తున్నారు. త్రివిక్రమ్ కు తెలియకుండానే ముగ్గురు హీరోలతో మూడేసి సినిమాలు చేసిన ఘనత ఆయన సొంతం అయితే త్రివిక్రమ్ కు ఈ సినిమా మంచి హిట్ ఇస్తుందా? లేక ఫట్ మనిపిస్తుందా అని అందరు ఎదురు చూస్తున్నారు. ఇలా త్రివిక్రమ్ సినిమా గురించి రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి.






