26.4 C
India
Friday, March 21, 2025
More

    AP One Chance : ఏపీకి ఒక్క చాన్స్ ఇస్తారా.. మళ్లీ మొండిచేయేనా..?

    Date:

    AP One Chance :  కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ప్రధాని మోదీ సిద్ధమవుతున్నారు. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలను దీటుగా ఎదుర్కొనేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. అందుకే మంత్రి వర్గంలోకి మరికొందరినీ తీసుకొని జంబో టీం సిద్ధం చేసుకోవాలని ఆయన భావిస్తున్నారు. అయితే సోమవారం పలువురు మంత్రలతో మోదీ సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి వర్గ కూర్పుపై చర్చించారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా మరికొన్ని రాష్ర్టాలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు.

    అయితే మంత్రివర్గ విస్తరణలో ఈసారైనా ఏపీకి చాన్స్ దక్కుతుందా లేదా అనేది సంశయంగానే కనిపిస్తున్నది. ప్రతి సారి తమ రాష్ర్టానికి చోటు దక్కుతుందని ఆశపడుతున్న వారికి నిరాశే ఎదురవుతున్నది. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళలకు కూడా కేబినెట్లో చోటు దక్కింది. కానీ ఏపీకి మాత్రం.. కేంద్రమంత్రి లేకుండా పోయారు.

    బీజేపీ తరపున ఏపీ నుంచి ఎంపీలు ఎవరూ లేరు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన టీజీ వెంకటేష్, సుజనా చౌదరి మాజీలయ్యారు. కేవలం సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావు ఇద్దరే ఉన్నారు. అయితే జీవీఎల్ యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో సీఎం రమేశ్ ఒక్కరే ఏపీ నుంచి ఉన్నారు. మరి ఈ సారి ఏపీకి చాన్స్ ఉంటుందా.. లేదా అనేది బీజేపీ హైకమాండ్ నుంచి మాత్రం ఎలాంటి టాక్ బయటకు రావడం లేదు. ఏపీకి ఓ కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి అనుకుంటే.. సీఎం రమేష్ లేదా జీవీఎల్ కు మాత్రమే చాన్స్ ఉంది. ఇంకెవరిని తీసుకున్నా వారికి రాజ్యసభ సభ్యత్వం కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

    ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అయితే ఈ సారి మరో బీసీ నేతకు మంత్రి కి అవకాశం ఇస్తారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇటీవల ఓబీసీ మోర్చా . అధ్యక్షుడు లక్ష్మణ్ కు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. ఆయనతో పాటు ఇద్దరు లోక్ సభ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ ఉన్నారు. బండి సంజయ్ ప్రస్తుతం టీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. మరోవైపు ధర్మపుర అర్వింద్ ఎంపీగా గెలవడం ఇదే తొలిసారి. దీంతో లక్ష్మణ్కు అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు. ఏదేమైనా కేంద్ర మంత్రి అసలు తెలుగు రాష్ర్టాలకు చాన్స్ ఉంటుందా.. లేదా అనేది కూడా ఇంకా సంశయంగానే ఉంది. అయితే తెలంగాణపై బీజేపీ దృష్టి ఉంటే కచ్చితంగాతెలంగాణ వ్యక్తికే దక్కే చాన్స్ ఉంది. ఏపీపై పెద్దగా పట్టింపు అవసరం లేదని బీజేపీ భావిస్తున్నది. సో ఏపీకి మరోసారి మొండిచేయి తప్పదని అంతా అనుకుంటున్నారు. మరి ప్రధాని మోదీ మనసులో ఏ లెక్కలు ఉన్నాయో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..

    Share post:

    More like this
    Related

    OG Movie : ‘ఓజీ’ నుంచి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్!

    OG Movie Update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ'...

    Dog for Rs. 50 crores : రూ.50 కోట్లతో కుక్కను కొన్న బెంగళూరు వ్యక్తి!

    Dog for Rs. 50 crores : బెంగళూరుకు చెందిన సతీశ్...

    Chiranjeevi : యూకే పార్లమెంట్‌లో చిరంజీవికి జీవితకాల సాఫల్య పురస్కారం!

    Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో...

    40 Plus తర్వాత.. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితం కోసం సూచనలు!

    40 Plus : ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో ఆందోళన కలిగించే విషయాలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MLA Amarnath Reddy : ‘వైసీపీ’ పోలీసులను మార్చరా? టీడీపీ నేత మృతికి వాళ్లే కారణం : పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి

    MLA Amarnath Reddy : పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుడి మరణంపై స్థానిక...

    MLCs in AP : ఏపీలో ఐదుగురు ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం

    MLCs in AP : ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు...

    Vijayasai Reddy : మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి సీఐడీ నోటీసులు

    Vijayasai Reddy : మాజీ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్...

    Minister Nadendla : పవన్ కళ్యాణ్ వల్లే చంద్రబాబు సియం అయ్యారు : మంత్రి నాదెండ్ల

    Minister Nadendla : జనసేన ఎమ్మెల్యే, మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు...