
Team India – TDP Victory Celebrations : తెలుగుదేశం పార్టీ సంబురాలు ఖండాంతరాలను దాటాయి. ఒక రాష్ట్ర పార్టీ విజయోత్సవాలను విదేశాలలో జరుపుకుంటున్నారంటే అది ఒక తెలుగుదేశం పార్టీకే చెల్లుతుంది. అంతటి ఖ్యాతి, కీర్తి దక్కించుకుంది టీడీపీ. జూన్ 4న ఫలితాలు వెలువడినప్పటి నుంచి ప్రతీ రోజు ఏదో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు తెలుగువారు, తెలుగుదేశం అభిమానులు. రెండు, మూడు రోజులుగా ర్యాలీలు, సంబురాలు చేసుకుంటూనే సాంఘిక పరమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాంటి కార్యక్రమమే ఈ రోజు (జూన్ 9) నిర్వహించరు.
T20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూయార్క్ సిటీలో జూన్ 9, 2024 (ఆదివారం) రోజున భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. ప్రపంచంలో అత్యంత ఎక్కువ వ్యూవర్స్ చూడాలనుకునే క్రికెట్ మ్యాన్ భారత్ వర్సెస్ పాక్. ఈ మ్యాచ్ ఉందంటే చాలు స్టేడియం మొత్తం నిండిపోవడం, కోలాహలం, అరుపులు, కేకలతో ఉంటుంది. ఇండియా లేదంటే పాక్ నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా అభిమానులు ఈ మ్యాచ్ తిలకించేందుకు వస్తుంటారు. అందుకే ఈ మ్యాచ్ కు అంత క్రేజ్ ఉంటుంది.
ఈ మ్యాచ్ లో పాక్ పై భారత్ విజయం సాధించింది. మొదట టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ను ఎంచుకుంది. ఒక్క ఓవర్ వేయడంతోనే వర్షం పడింది. దీంతో మ్యాచ్ ను కాసేపు నిలిపివేశారు. ఆ తర్వాత పిచ్ తడవడంతో భారత్ ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. అయినా 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 113 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయారు.
పాక్ పై భారత్ గెలవడం, తెలుగుదేశం పార్టీ ఏపీలో విజయం సాధించడం, మోడీ ప్రభుత్వం కొలువుదీరడం ఇవన్నీ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. స్టేడియంలో ఆహారం అందించారు. అందించిన వారిలో శ్రీనివాస్, శేఖర్ బాబు, విజయ, ప్రసాద్, సుమతి ఉన్నారు. వీరికి పలువురు అభినందనలు తెలిపారు. స్టేడియంలో అందించడంలో సాయపడిన వలంటీర్లకు ధన్యవాదాలు తెలిపారు.