
Srikakulam : శ్రీకాకుళంలో వైసీపీ నాయకులు ఓ రిటైర్డు ప్రధానోపాధ్యాయుడి స్థలాన్ని ఆక్రమించి వైసీపీ కార్యాలయ భవనాన్ని నిర్మించారు. పెద్దపాడు వద్ద జాతీయ రహదారి పక్కన ఎకరా యాభై సెంట్ల ప్రభుత్వ భూమిని వైసీపీ నాయకులు 33 ఏళ్లకు ఏడాదికి ఎకరాకు రూ.1000 చొప్పున లీజుకు తీసుకున్నారు. అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే 90 శాతం భవన నిర్మాణం పూర్తిచేశారు. ఈ కార్యాలయానికి పక్కనే ఉపాధ్యాయ సంఘానికి చెందినలే అవుట్లు ఉన్నాయి. అందులో 30 సెంట్ల వరకు ఆక్రమించేశారు. ఎకరా యాభై సెంట్లలో నిర్మించాల్సిన భవనాన్ని దాదాపు రెండెకరాల్లో నిర్మించారు.
కోటబొమ్మాళికి చెందిన రిటైర్డు ప్రధానోపాధ్యాయుడు జి. వెంకటరమణ 1993లో ఐదున్నర సెంట్ల భూమిని కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాు. తన భూమి కబ్జా చేసి షెడ్డు, ప్రహరీ నిర్మించారని బాధితు వాపోతున్నారు. గత అక్టోబరు 6న స్థానిక పోలీసులకు, తహసీల్దారు, సర్వేయర్ కు ఫిర్యాదు చేయగా చర్యతు తీసుకోలేదని, పైగా ఎవరికి చెప్పి ఆ స్థలాన్ని కొన్నావంటూ తనపైనే ఆగ్రహం వ్యక్తం చేశారని ఆయన తెలిపారు.