Gautam Gambhir : గౌతమ్ గంభీర్ ఇండియా క్రికెట్ టీంకు కొత్త కోచ్ గా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే గౌతం గంభీర్ ఒకానొక ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. దేశానికి రెండు వరల్డ్ కప్ లు అందించిన వ్యక్తి యువరాజ్ సింగ్ అని ప్రశంసించాడు. 2007 టీ 20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ లో మ్యాన్ ఆప్ ది సిరీస్ లు గెలుచుకున్న యువరాజ్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
ఒక వ్యక్తి క్యాన్సర్ తో పోరాడుతూ కూడా అద్భుతంగా రాణించి టీం ఇండియాకు ప్రపంచ కప్ అందించాడంటే ఆషామాషీ వ్యవహారం కాదన్నాడు. కానీ యువరాజ్ కు మాత్రం సరైనంత గౌరవం మాత్రం అందడం లేదు. ఎందుకంటే యువరాజ్ కంటే తక్కువ చేసిన వారికి కూడా అంతకంటే ఎక్కువ క్రెడిబిలిటీ సొంతం చేసుకుంటున్నారు.
యువరాజ్ ఒక స్టార్ బ్యాట్స్ మెనే కాకుండా స్టార్ బౌలర్ కూడా. మంచి ఆల్ రౌండర్. ఇంతవరకు అలాంటి ఆల్ రౌండర్ ఇండియాకు దొరకడం అరుదు. అయితే ఇండియాకు ఆడిన ప్రతిసారి యువరాజ్ ప్రాణం పెట్టేవాడు. ఆటలో అంతగా లీనమై పోయేవాడని గంభీర్ అన్నాడు.
ప్రాణాంతక వ్యాధితో మైదానంలో యువరాజ్ పోరాడుతూ.. రక్తం కక్కుతూ కూడా వెస్టిండీస్ పై సెంచరీ చేశాడు. ఇంత చేసిన వ్యక్తికి భారత రత్న ఇవ్వడం సబబు అనిపిస్తోందంటూ యువరాజ్ సింగ్ ను గౌతం గంభీర్ ఆకాశానికెత్తేశాడు.
ఇండియా క్రికెట్ కు యువరాజ్ లాంటి ఆల్ రౌండర్ మరొకరు దొరకరని అన్నాడు. ప్రస్తుత క్రికెట్ లో ప్రతి ప్లేయర్ ను హిరోలుగా పరిగణిస్తున్నాం. కానీ యువరాజ్ సింగ్ లాంటి రియల్ హిరోలను మాత్రం పట్టించుకోవడం మానేశామంటూ చెప్పాడు. అదే సమయంలో 1983 వరల్డ్ కప్ ఫైనల్ హిరో ఎవరో తెలుసా అంటూ యువతరాన్ని ప్రశ్నించాడు.