నేడ హనుమాన్ జయంతి. ఆంజనేయుడిని అందరు కొలుస్తారు. అభయాలు నెరవేర్చే స్వామిగా ఆయనకు పేరుంది. అందుకే మనకు భయం కలిగినప్పుడు జై ఆంజనేయ అంటాం. దీంతో మనకున్న భయం తొలగిపోతుంది. అలా భక్తుల గుండెల్లో హనుమాన్ బలం అంత ఉంటుంది. అందుకే ఆంజనేయుడు మనలో ఉన్న భయం పోగొట్టే దేవుడిగా కొలుస్తాం. జై హనుమాన్ అంటే కొండంత అండ ఉన్నట్లు లెక్క.
హనుమాన్ జయంతులు రెండు ఉంటాయి. ఒకటి చైత్ర మాసంలో మరొకటి వైశాఖ మాసంలో వస్తుంటాయి. చైత్ర మాసంలో వచ్చే దాన్ని చిన్న జయంతి అని వైశాఖ మాసంలో వచ్చే దాన్ని పెద్ద జయంతి అని పిలుస్తారు. అందరికి ఒకే జయంతి ఉంటే మరి హనుమాన్ కు ఎందుకు రెండు జయంతులు అంటే దానికో చరిత్ర ఉంది.
రామాయణంలో సీత దగ్గరకు వెళ్లినప్పుడు నాకు ఆకలిగా ఉందమ్మా అంటే ఏదైనా పండు తిను అని అంటుంది. అప్పుడు సూర్యుడు ఎర్రగా కనిపించడంతో సూర్యుడిని మింగాలని చూస్తాడు. ఇంద్రుడు వజ్రాయుధం వేయడంతో ఆంజనేయుడి రూపం మారిపోతుంది. అతడు మళ్లీ ఓ జన్మ ఎత్తినట్లు అవుతుందట. అందుకే రెండో జయంతిని నిర్వహిస్తారు.
అసలు ఆంజనేయుడి పేరు సుందరుడు. అంజలీ దేవి పుత్రుడు కావడంతో ఆంజనేయుడని, కేసరి తనయుడు కేసరీనందనుడని పలు రకాల పేర్లతో పిలుస్తుంటారు. ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. భక్తుల బాధలను తీర్చే బాంధవుడిగా ఆంజనేయుడికి పేరుంది. అందుకే హనుమాన్ ను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. తమ మొక్కులు చెల్లించుకుంటారు.
నేడు నిర్వహించే హనుమాన్ జయంతికి భక్తులు పోటెత్తారు. భక్తుల కిటకిటతో కొండగట్టు జనసంద్రంగా మారింది. ఎటు చూసినా హనుమాన్ స్వాములే. దీంతో అందరిలో భక్తిభావం కనిపిస్తుంది. ఆంజనేయుడిని మొక్కి తమకు మంచి చేయాలని కోరుకుంటారు. ఆంజనేయుడి దయ మాపై ఉంచాలని ప్రార్థిస్తుంటారు. 41, 21, 11 రోజులు మాల వేసుకుని హనుమాన్ ను వేడుకుంటారు. ఇవాళ మాల విరమణ చేసుకుని తిరుగు ప్రయాణం అయి వెళ్తుంటారు.