దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు వందల సంఖ్యలోనే కరోనా కేసులు నమోదు అయ్యేవి అయితే గత వారం రోజులుగా వేగంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. నిన్నటి రోజున దేశ వ్యాప్తంగా 3800 కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ప్రస్తుతం దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపు 20 వేలకు చేరుకుంది.
కరోనా టెస్ట్ లు పెంచాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. అయితే ఇంకా టెస్ట్ ల సంఖ్య పెంచలేదు. ఒకవేళ టెస్ట్ ల సంఖ్య పెంచితే తప్పకుండా ఈ సంఖ్య మరీ దారుణంగా ఉంటుందని భావిస్తున్నారు. మళ్లీ కరోనా కేసులు పెరగడంతో పాటుగా మృతుల సంఖ్య కూడా నమోదు అవుతుండటంతో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం హెచ్చరించింది