
ఒళ్ళు గగుర్పొడిచే సంఘటనలు అడపా దడపా జరుగుతూనే ఉన్నాయి. అలాంటి వణికిపోయే సంఘటనే ” డేటా చోరీ ” కేసు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 66 కోట్ల మంది భారతీయుల డేటా చోరీకి గురయ్యింది. 66 కోట్ల భారతీయుల డేటా ను అప్పనంగా అమ్మేసుకున్నాడు
ఫరీదాబాద్ కు చెందిన వినయ్ భరద్వాజ్. 66 కోట్ల భారతీయుల డేటా చోరీలో హైదరాబాద్ కు చెందిన కోటి మంది ఉన్నారు.
హైదరాబాద్ జనాభా కోటికి పైగా ఉంటే ఇందులో మొత్తంగా మొత్తం డేటా చోరీ అయ్యిందట. దేశంలోని 6 మెట్రోపాలిటన్ నగరాల్లో నాలుగు లక్షలకు పైగా స్టాఫ్ ను పెట్టుకొని ఈ చోరీకి పాల్పడ్డాడు వినయ్ భరద్వాజ్. ఇటీవల సైబరాబాద్ పోలీసులు ఈ కేసును చేధించిన విషయం తెలిసిందే. అయితే మొదట్లో ఇది చిన్న కేసు అనుకున్నారు కట్ చేస్తే తీగ లాగుతుంటే డొంక కదిలింది. ఆ లిస్ట్ చూసి కళ్ళు బైర్లు కమ్మిందట పోలీసులకు.
మన దేశ జనాభా 140 కోట్లకు పైగా ఉంటే అందులో 66 కోట్ల జనాభా డేటా మొత్తం చోరీ అయ్యిందంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామో అర్ధం చేసుకోవచ్చు. మనకు తెలియకుండానే ఆధార్ , పాన్ కార్డు , పాస్ పోర్ట్ , క్రెడిట్ కార్డు , డెబిట్ కార్డు , ఇన్సూరెన్స్ , ఇన్ కం ట్యాక్స్ ల కోసం మన వివరాలు ఇస్తుంటాం. దాన్నే ఆయుధంగా చేసుకొని డేటా చోరీ చేశారట. 66 కోట్ల మంది డేటా చోరీ చేసిన వినయ్ భరద్వాజ్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు.






