
ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం మనదేశంలోనే ఉంది. అయితే ఆ పుణ్యక్షేత్రం గురించి పెద్దగా ప్రచారం లేదు దాంతో ఆ అద్భుత కట్టడాల గురించి బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియలేదు. మనకు తెలిసిందల్లా ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడం తాజ్ మహల్ అని మాత్రమే భావిస్తారు. అయితే తాజ్ మహల్ గొప్ప కట్టడమే అయినప్పటికీ అంతకుమించిన అద్భుతం గుజరాత్ లోని పాలిటానా పుణ్యక్షేత్రం.
ఈ పుణ్యక్షేత్రంలో ఏకంగా 900 కంటే ఎక్కువ దేవాలయాలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం. తొమ్మిది వందలకు పైగా దేవాలయాలు ఒకే సమూహమున ఉన్నాయి. ఈ దేవాలయాలు అద్భుత శిల్ప కళా సంపదతో తులతూగుతున్నాయి. అద్భుతమైన ఈ కట్టడాల గురించి భారతదేశంలోని మిగతా రాష్ట్రాలకే తెలియదు ……. ఇక ప్రపంచానికి ఏం తెలుస్తుంది. ఎందుకంటే ఈ దేవాలయాల గురించి పెద్దగా ప్రచారంలో లేదు మరి. భారత్ గొప్ప వారసత్వం ఈ అద్భుత దేవాలయాల నిర్మాణం. దాంతో విమానం ద్వారా ఈ మొత్తం అద్భుతాన్ని వీడియోలో చిత్రీకరించారు. ఈ వీడియో చూస్తే నిజంగా ఇది మన దేశమేనా ? మన భారత్ లో ఇంతటి అద్భుతం ఉందా ? అని ముక్కున వేలేసుకోవడం…… ఆశ్చర్యపోవడం ఖాయం ……. అంత అద్భుతంగా ఉంది మరి. మీరూ ఓ లుక్కేయండి ఈ వీడియోను.






