GSLV మార్క్ 3- M 3 రాకెట్ విజయవంతమైంది. ఈ ప్రయోగంతో అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ సరికొత్త శక్తిగా అవతరించింది. జీఎస్ఎల్వి మార్క్ 3 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. శనివారం ఉదయం 8:30 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభించారు. కాగా ఈరోజు ఉదయం 9 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 5805 కిలోల బరువున్న 36 ఉప గ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. యూకేకు చెందిన యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్ కంపెనీ , భారత్ కు చెందిన భారతి ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా వన్ వెబ్ ఇండియా – 2 పేరుతో ఈ రాకెట్ ప్రయోగించారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ తదితరులు ఇస్రో ను అభినందించారు.
Breaking News