
దేశంలో ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఉప్పులు,పప్పులు,నిత్యావసర సరకులు ఇలా వేటిని చూసిన రెట్లు భగ్గుమంటున్నాయి. ఇక వంట నూనెల సంగతైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వంట నూనె వాడాలంటే దిన దినం ప్రాణ గండం అన్న చందనంగా తయారైంది. గ్యాస్,పెట్రోల్, డిజిల్ పరిస్థితి కూడా అంతే. వీటికి పట్ట పగ్గాలు లేకుండా ప్రభుత్వాలు రెట్లను పెంచేస్తున్నాయి.
దీంతో కొన్నాళ్లుగా కేంద్ర సర్కార్పై సామాన్య పబ్లిక్ గుస్సాగా ఉన్నారు. అయితే పరిస్థితి ఇలా ఉంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కర్నాటక ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధరలు పెరుగుతున్న మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. అంతేకాక సామాన్య ప్రజలు పెరిగిన ధరలతో కుటుంబాలను ఎలా నెట్టకొస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పెరిగిన ధరలు తనను తీవ్ర మనో వేదనకు గురి చేస్తున్నాయని కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.
ఇక కర్నాటక శాసన సభ ఎన్నికల్లో జేడీఎస్,కాంగ్రెస్ పార్టీలు ధరల పెరుగుదలనే ప్రధాన ఆస్త్రంగా మలుచుకున్నాయి. పెరిగిన ధరలను అదుపు చేయడంలో బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ దారుణంగా విఫమైందని ఈ రెండు పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కర్నాటకలో ప్రతీ ఎన్నికల సభలో జేడీఎస్,కాంగ్రెస్ పార్టీలు బీజేపీవి ప్రజా వ్యతిరేక విధానాలంటూ తూలనాడుతున్నాయి. అయితే ధరల పెరుగుదలపై విపక్షాలు ఇలా దూకుడుగా వెళుతున్న నేపథ్యంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు విపక్షాలకు బూస్ట్లా మారినట్లైంది. దీంతో అసలు స్వంత మంత్రి నిర్మలమ్మపైనే కర్నాటక బీజేపీ నేతలు గుస్సా అవుతున్నారు. ఆర్థిక మంత్రిగా పని చేస్తున్న ఆమెకు ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడాలో తెలియదా..? అని నిలదీస్తున్నారంటా..!






