
రైల్వే ఫ్లాట్ ఫామ్ లపై ఏర్పాటు చేసిన టీవీ లలో అకస్మాత్తుగా బ్లూ ఫిల్మ్ ప్రసారమైంది. దాంతో వేలాది మంది ప్రయాణీకులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. రైల్వే ఫ్లాట్ ఫామ్ కావడంతో మహిళలు , వృద్ధులు , పిల్లలు అందరూ ఉన్నారు. తమతమ గమ్య స్థానాలకు వెళ్లాలని భావించి వచ్చిన వాళ్లకు ఒక్కసారిగా బ్లూ ఫిల్మ్ టీవీ లలో ప్లే అవుతుండటంతో సిగ్గుతో తలదించుకున్నారు. బ్లూ ఫిల్మ్ ఏకంగా 3 నిమిషాల పాటు ప్రసారం కావడం గమనార్హం. ఈ సంచలన సంఘటన బీహార్ రాష్ట్రం లోని పాట్నా లో జరిగింది.
రైల్వే ఫ్లాట్ ఫామ్ లలో పెద్ద ఎత్తున టీవీ లను ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. ప్రయాణీకుల సౌకర్యార్థం అలాగే ప్రకటన ల కోసం ఇవి ఏర్పాటు చేశారు. అయితే అందులో రకరకాల యాడ్స్ వచ్చే క్రమంలో 10 వ నెంబర్ ఫ్లాట్ ఫామ్ మీద బ్లూ ఫిల్మ్ ప్రసారమైంది. ఈ విషయం రైల్వే అధికారులకు తెలియడంతో ఖంగుతిన్నారు. దత్త కమ్యూనికేషన్స్ సంస్థ ఈ వ్యవహారాలు చూస్తోంది కాబట్టి ఆ సంస్థపై చర్యలకు ఉపక్రమించారు రైల్వే అధికారులు. ప్రస్తుతం ఈ సంఘటన పై దర్యాప్తు చేస్తోంది రైల్వే శాఖ.