
లోక్ సభ సభ్యుడిగా నాకు కేటాయించిన ఇంటిని ఖాళీ చేస్తున్నానని లోక్ సభ హౌసింగ్ కమిటీ కి తెలిపాడు రాహుల్ గాంధీ. 2019 లో ఈ దేశాన్ని భ్రష్టు పట్టించిన దొంగల పేర్లన్నీ మోడీ పేరుతోనే ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేసాడు రాహుల్ గాంధీ. కాగా ఆ వ్యాఖ్యలను తప్పు పడుతూ గుజరాత్ లోని సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు బీజేపీ నాయకులు. ఆ కేసులో రాహుల్ గాంధీని దోషిగా గుర్తిస్తూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. రాహుల్ గాంధీకి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో వెంటనే లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.
ఇక లోక్ సభ సభ్యత్వం రద్దు కావడంతో రాహుల్ గాంధీతో పాటుగా కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర షాక్ కు గురయ్యారు. ఆ షాక్ నుండి కోలుకోకముందే లోక్ సభ సభ్యులకు కేటాయించిన ఫ్లాట్ ను ఖాళీ చేయాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి. దాంతో వరుస షాకింగ్ సంఘటనలతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే తనపై కక్ష్య కట్టిన మోడీ సర్కారును గడువు కోరడం కూడా మంచిది కాదని భావించిన రాహుల్ గాంధీ మీరు నాకు కేటాయించిన ఇంటిని ఖాళీ చేస్తున్నానని స్పష్టం చేశాడు.






