ఈరోజు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా వస్తున్నాడు దాంతో పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు. ఈరోజు రాత్రి 8:30 గంటలకు హకీంపేట ఎయిర్ పోర్ట్ లో దిగుతారు. నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడెమీ లో రాత్రి బస చేస్తాడు. రాత్రి బీజేపీ కీలక నాయకులతో అమిత్ షా సమావేశం అవుతారు. కవిత లిక్కర్ స్కామ్ కేసు , తెలంగాణలో బీజేపీ ఎదుగుదల కోసం ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి ? కవిత అరెస్ట్ తర్వాత కేసీఆర్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి అందుకు తగ్గట్లుగా బీజేపీ ఏం చేయాల్సి ఉంటుంది తదితర విషయాలను బీజేపీ కీలక నాయకులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
సీఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం కేరళ లోని కొచ్చికి బయలుదేరి వెళ్తారు. సంగారెడ్డి లో మేధావులతో సమావేశం కొనసాగించాల్సి ఉండే అయితే కొచ్చి కార్యక్రమం వల్ల సంగారెడ్డి కార్యక్రమం రద్దు అయినట్లు తెలుస్తోంది.